Home » Lok Sabha Election 2024
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్గాంధీని ఎన్నుకొనే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. గత రెండు దఫాలుగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియాగాంధీ వ్యవహరించారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకోవడం పదేళ్లుగా నామమాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్గాంధీ నాయకత్వంలో తిరిగి జాతీయ స్రవంతిలో పుంజుకొని సాధారణ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించడంతో ఆయన్నే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకోవాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.
వరుసగా మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన నెహ్రూ రికార్డును మోదీ సమం చేశారు. కాంగ్రెసేతర పక్షాల నుంచి ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న తొలి వ్యక్తి మోదీనే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో తొలిసారి లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఫలితాల తర్వాత నెహ్రూ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1957, 62 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రె్సను ఆయన విజయపథాన నడిపించి ప్రధాని అయ్యారు. నెహ్రూ కుమార్తె ఇందిరకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు.
నరేంద్ర మోదీ సరైన సమయంలో భారత దేశానికి లభించిన సరైన నాయకుడని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. తన విధానాలను సమర్థంగా అమలు చేయడంలో ఆయన్ను మించిన వారు లేరని.. విజన్ ఉన్న ఆయన హయాంలో ఏది అనుకుంటే అది సాధించగలమని ప్రశంసించారు. శుక్రవారమిక్కడ పార్లమెంటు సెంట్రల్ హాలులో శుక్రవారం జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
కేంద్ర ప్రభుత్వ పాలనకు సంబంధించి ఇక అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయంతోనే తీసుకునేందుకు కృషి చేస్తానని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. అన్నింటికన్నా దేశం ముఖ్యం అన్న సూత్రానికి కట్టుబడి ఎన్డీఏ కూటమి పని చేస్తుందని చెప్పారు. శుక్రవారం ఉదయం పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాలులో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత కూటమి ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఓవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంటే.. మరోవైపు ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి..
మంగళగిరి ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాజాగా రెడ్ బుక్పై స్పందించారు. శుక్రవారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేశ్ మాట్లాడుతూ.. రెడ్ బుక్ ఎందుకు ఫేమస్ అయింది. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది తదితర వివరాలను వెల్లడించారు.
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు అయింది. జూన్ 9వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు న్యూఢిల్లీలో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ.. ఆసియాలో తొలి మహిళ లోకో పైలెట్ సురేఖ యాదవ్ను ఆహ్వానం అందింది.
ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ స్థానాల్లో కమలం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి గల కారణాలను పార్టీ అన్వేషిస్తుంది. ఆ క్రమంలో ‘ఆప్’ ఓటమికి కారణాల్లో మాజీ ఎమ్మెల్యే నితీన్ త్యాగి ఒకరని ఆ పార్టీ గుర్తించింది.
ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోదీని భాగస్వామ్య పక్షాలు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. అనంతరం మోదీ.. బీజేపీ సీనియర్ నేత, భారతరత్న ఎల్ కె అద్వానీ నివాసానికి వెళ్లారు. ఆయన వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి నివాసానికి మోదీ వెళ్లారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకు కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 99 స్థానాలకు గెలుచుకుంది. అయితే మహారాష్ట్ర సింగ్లి లోక్సభ సభ్యుడు విశాల్ పాటిల్.. గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.