Home » Lavu Sri Krishna Devarayalu
Vidadala Rajini: ఏసీబీ కేసు నమోదు కావడంతో మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజిని స్పందించారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు.
MP Lavu Sri Krishna Devarayalu: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. ఈ అక్రమాల వల్ల భూములు కోల్పోయిన వారికి .. తిరిగి భూములు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఆయన కీలక సూచనలు చేశారు.
MP Lavu Sri Krishna Devarayalu: పోలవరం ప్రాజెక్ట్కు రూ.12 వేలు కోట్లు మాత్రమే ఇచ్చారు కొందరు అంటున్నారని.. అయితే గత పాలనలో అసలు అభివృద్ధి జరగలేదని.. అది ముందు ఆలోచించాలంటూ వైసీపీ నేతలను పరోక్షంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు చురకలంటించారు. అలాగే కేంద్రం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తుందో ఆయన వివరించారు. ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలను గణాంకాలతో సహా ఆయన తెలిపారు.
Lavu Krishna Devarayalu:మరికొద్ది రోజుల్లో ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. అలాగే ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అలాంటి వేళ.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు నేతలు బుధవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు పెట్టడం మంచిదేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అయితే జమిలి ఎన్నికలకు ఇంకా సమయం ఉందని పేర్కొన్నారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా చెబితే ఆ విధంగా నడుచుకుంటామని తెలిపారు.
పదేళ్లుగా నెమ్మదిగా పోలవరం నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులపై పార్లమెంట్లో చర్చ జరగాలని కోరానని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో నెలకొన్న పరిస్థితి, జాప్యానికి కారణాలపై కూడా చర్చ జరగాలని కోరానని చెప్పారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభకానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు.. పార్టీ ఎంపీలతో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా .. ఈ సమావేశాల్లో అనుసరించ వలసిన వ్యూహాంపై పార్టీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా గడిచింది. ఈ పర్యటనలో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్తో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారితో సీఎం చంద్రబాబు చర్చించారు.
ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఇమాములు, ముస్లింలకు గౌరవ వేతనం ఇవ్వడంతోపాటు, హజ్ యాత్రకు రూ.లక్ష ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.
వైసీపీ(YSRCP) పాలనలో ఏపీ అప్పులపాలైందని తెలుగుదేశం(TDP) పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీ కృష్ణదేవరాయలు విమర్శించారు. అప్పుల భారం రాష్ట్రానికి గుదిబండగా మారిందన్నారు. మంగళవారం ఆయన ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ చేసిన అప్పులను పునర్వ్యవస్థీకరించాలని పేర్కొన్నారు.