Home » Lavu Sri Krishna Devarayalu
ఏపీలో మద్యం కుంభకోణంకు సంబంధించి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇదే అంశంపై నిన్న (మంగళవారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో అక్రమ మద్యం వ్యాపారం జరిగిందని ఎంపీ లావు వివరించారు.
MP Sri Krishna Devarayalu: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సంచలన ఆరోపణలు చేశారు. మద్యం కుంభకోణలో వేలకోట్లు సంపాదించారని ఆరోపించారు. నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి విడదల రజిని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్ ఇచ్చారు. రజినీ వేధింపులు ఎదుర్కొన్న స్టోన్ క్రషర్స్ సంస్థ కేసు పెడితే తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారి జాషువా స్టేట్మెంట్, ఇతర అధికారుల స్టేట్మెంట్లు కూడా ఉన్నాయన్నారు. తాను వైయస్సార్సీపి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి గురించి కూడా తాను మాట్లాడలేదని.. కానీ..
Vidadala Rajini: ఏసీబీ కేసు నమోదు కావడంతో మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజిని స్పందించారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు.
MP Lavu Sri Krishna Devarayalu: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. ఈ అక్రమాల వల్ల భూములు కోల్పోయిన వారికి .. తిరిగి భూములు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఆయన కీలక సూచనలు చేశారు.
MP Lavu Sri Krishna Devarayalu: పోలవరం ప్రాజెక్ట్కు రూ.12 వేలు కోట్లు మాత్రమే ఇచ్చారు కొందరు అంటున్నారని.. అయితే గత పాలనలో అసలు అభివృద్ధి జరగలేదని.. అది ముందు ఆలోచించాలంటూ వైసీపీ నేతలను పరోక్షంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు చురకలంటించారు. అలాగే కేంద్రం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తుందో ఆయన వివరించారు. ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలను గణాంకాలతో సహా ఆయన తెలిపారు.
Lavu Krishna Devarayalu:మరికొద్ది రోజుల్లో ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. అలాగే ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అలాంటి వేళ.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు నేతలు బుధవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు పెట్టడం మంచిదేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అయితే జమిలి ఎన్నికలకు ఇంకా సమయం ఉందని పేర్కొన్నారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా చెబితే ఆ విధంగా నడుచుకుంటామని తెలిపారు.
పదేళ్లుగా నెమ్మదిగా పోలవరం నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులపై పార్లమెంట్లో చర్చ జరగాలని కోరానని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో నెలకొన్న పరిస్థితి, జాప్యానికి కారణాలపై కూడా చర్చ జరగాలని కోరానని చెప్పారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభకానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు.. పార్టీ ఎంపీలతో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా .. ఈ సమావేశాల్లో అనుసరించ వలసిన వ్యూహాంపై పార్టీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.