• Home » Lakshman

Lakshman

TG Politics: శ్రీరామ కళ్యాణ మహోత్సవంపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

TG Politics: శ్రీరామ కళ్యాణ మహోత్సవంపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భద్రాచలంలో రేపు(బుధవారం) జరిగే శ్రీరామ కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) నిలిపివేసింది. కళ్యాణాన్ని ఈసీ నిలిపివేయడంతో ఈ చర్యలను రాజకీయ పార్టీలు తప్పుపడుతున్నాయి. ఈ మేరకు మంగళవారం నాడు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి శ్రీరామ కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని వివరించారు.

TG Politics: లోక్‌సభ ఎన్నికల తర్వాత పరిస్థితులు మారుతాయి.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

TG Politics: లోక్‌సభ ఎన్నికల తర్వాత పరిస్థితులు మారుతాయి.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని బీజేపీ (BJP) రాజ్యసభ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ (Lakshman) అన్నారు. ఆదివారం నాడు టేక్మాల్ మండలం పాల్వంచలో బీజేపీ జహీరాబాద్ పార్లమెంట్ బూత్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సభకు లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, ఆలే భాస్కర్, బీబీ పాటిల్ తదితరులు హాజరయ్యారు.

MP Lakshman: బీసీల రిజర్వేషన్లపై మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్

MP Lakshman: బీసీల రిజర్వేషన్లపై మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్

బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ (Lakshman) అన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నాడు బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ...మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోందని లక్ష్మణ్ తెలిపా

MP Laxman: ఆ సంస్థల నుంచి విద్యుత్ కొనేలా ప్లాన్ చేస్తున్న సీఎం రేవంత్

MP Laxman: ఆ సంస్థల నుంచి విద్యుత్ కొనేలా ప్లాన్ చేస్తున్న సీఎం రేవంత్

కమీషన్ల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనటానికి సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్లాన్ చేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) అన్నారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... విద్యుత్ కొనుగోళ్లపై ఎన్టీపీసీ‌ లేఖలు రాస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన తప్పులనే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు.

 MP Laxman: 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న సీఎం రేవంత్

MP Laxman: 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న సీఎం రేవంత్

దేశ ప్రజలే మోదీ కుటుంబ సభ్యులని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ( MP Laxman ) అన్నారు. బుధవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈనెల 12వ తేదీన తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని తెలిపారు.

PM Modi: రూ.7వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన  ప్రధాని మోదీ

PM Modi: రూ.7వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని మోదీ

Telangana: రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారులోని పటేల్ గూడకు చేరుకున్న మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. లింగంపల్లి- ఘట్‌కేసర్ ఎంఎంటీఎస్ రైలు‌ను ప్రధాని వర్చ్‌వల్‌గా ప్రారంభించారు. దాదాపు రూ.7వేల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టారు.

Adluri Laxman:కేటీఆర్, హరీశ్‌రావు మధ్య ఆ పంచాయతీ నడుస్తోంది

Adluri Laxman:కేటీఆర్, హరీశ్‌రావు మధ్య ఆ పంచాయతీ నడుస్తోంది

అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చిస్తామంటే బీఆర్ఎస్ నేతలు పారిపోయారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్(Adluri Laxman) అన్నారు. సోమవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.

MP Laxman: వారితో కాంగ్రెస్ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకుంది

MP Laxman: వారితో కాంగ్రెస్ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకుంది

తెలంగాణ సంపద దోచుకున్న బీఆర్ఎస్ నేతలతో కాంగ్రెస్ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) అన్నారు. శనివారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... తెర వెనుక కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు బీఅర్ఎస్, కాంగ్రెస్‌కు అలవాటు అయ్యాయని ఆరోపించారు.

BJP: బీఆర్ఎస్ కాళ్ల బేరానికి వచ్చినా పొత్తు ఉండదు.. లక్ష్మణ్ సంచలన కామెంట్స్

BJP: బీఆర్ఎస్ కాళ్ల బేరానికి వచ్చినా పొత్తు ఉండదు.. లక్ష్మణ్ సంచలన కామెంట్స్

బీఆర్ఎస్(BRS) కాళ్ల బేరానికి వచ్చినా రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు ఉండబోదని బీజేపీ(BJP) ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. మంగళవారం భైంసాలో విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ.. తలకిందులుగా తపస్సు చేసినా కేసీఆర్‌ను దగ్గరకు రానివ్వమన్నారు.

MP Lakshman: బీఆర్ఎస్ చచ్చిన పాము.. బతికి బట్టకట్టే పరిస్థితుల్లో లేదు..

MP Lakshman: బీఆర్ఎస్ చచ్చిన పాము.. బతికి బట్టకట్టే పరిస్థితుల్లో లేదు..

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో తమ పార్టీకి పొత్తుండదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఒక చచ్చిన పాము అని.. బీఆర్ఎస్ ఇక మీదట బతికి బట్టకట్టే పరిస్థితుల్లో లేదన్నారు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేస్తామన్నారు. తమ పార్టీకి10 సీట్లు, 35శాతం ఓట్లు వస్తాయన్నారు. ఏపీలో పవన్ కల్యాణ్ తో పొత్తు ఉందన్నారు. టీడీపీతో పొత్తు విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి