Home » Kukatpally
కూకట్పల్లిలోని లులు మాల్లో తెలంగాణ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించింది. మాల్లోని బేకరీలో కాలం చెల్లిన ఆహార పదార్థాలు, బూజు పట్టిన బ్రెడ్ మిక్స్, 10 కిలోల అట్ట బ్రెడ్ మిక్స్, 15 కిలోల లూజ్ బాగుట్టి బ్రెడ్ మిక్స్కు బూజు పట్టినట్టు గుర్తించారు.
టీఎస్ఎప్సెట్ కౌన్సెలింగ్కు సమయం ఆసన్నమవుతున్నప్పటికీ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు జేఎన్టీయూ(JNTU) ఇచ్చే అఫిలియేషన్ ప్రక్రియ ఇంకా కొలిక్కిరాలేదు. ఎప్సెట్లో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు ఈనెల 27నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని సాంకేతిక విద్యాశాఖ అధికారులు నెలరోజుల (మే24న)కిందటే తేదీలను ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు దాటినా ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడం సిగ్గుచేటని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో బృందాలుగా విడిపోయి పటాన్చెరులోని ఆయన నివాసం, పట్టణంలోని శాంతినగర్లో ఉండే తమ్ముడు గూడెం మధుసూధన్రెడ్డి,
ఏపీలో ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత నగరానికి వచ్చిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(MLA Nandamuri Balakrishna)ను కూకట్పల్లికి చెందిన టీడీపీ రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు శనివారం కలిశారు.
రాష్ట్ర ప్రభుత్వం వద్ద అప్పులే తప్ప.. సంక్షేమ పథకాల కోసం నిధులు లేవని, లంకెబిందెలు ఉన్నాయని వస్తే.. ఖాళీ ఖజానా కనిపిస్తోందని రేవంత్రెడ్డి ఎన్నో మీటింగుల్లో గోడు వెళ్లబోసుకున్నది నిజం కాదా అని బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్(Etala Rajender) గుర్తు చేశారు.
కూకట్ పల్లి వై జంక్షన్ హుడా ట్రాక్ పార్క్ వద్ద దేశంలో అతిపెద్ద మెరైన్ ఎక్స్ పో నిర్వహిస్తున్నారు. ఇందులో 600 రకాల చేపలు ఉంటాయని నిర్వాహకుడు రాజశేఖర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఇందులో స్కూబా డైవింగ్ కూడా ఉందని వివరించారు.
ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో జేఎన్టీయూ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ(ఎఫ్ఎఫ్సీ) తనిఖీలకు వెళ్లిన అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తోంది.
టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ, ఓఎ్సడీ రాధాకిషన్ రావు తనను బెదిరించి రూ. కోటి విలువైన ప్లాటును రాయించుకున్నాడని రియల్టర్ మునగపాటి సుదర్శన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
నగరంలోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ( KPHB ) పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు దాష్టికం ప్రదర్శించారు. ఓ కేసులో విచారణ నిమిత్తం ప్రణీత్ అనే యువకుడిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి దారుణంగా కొట్టి, థర్ద్ డిగ్రీ ప్ర యోగించారని బాధితుడు ఆరోపించాడు. తీవ్రమైన గాయాలతో బాధితుడు ప్రణిత్ కొండాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు..