Home » Kollu Ravindra
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన ఏపీలో ఆదరణ లేకపోవడం బాధాకరమని మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మనది అని చెప్పుకొని సాంస్కృతిక, సాంప్రదాయ కళలు అంతరించిపోకుండా చూసుకునే బాధ్యత అందరిపై ఉందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
Minister Kollu Ravindraః మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. భార్యను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన పేర్ని నాని ఓ నేరగాడు అని విమర్శించారు. పోలీసులను బెదిరించేందుకే పేర్ని నాని ప్రెస్మీట్ పెట్టారని అన్నారు.
Andhrapradesh: మాజీ మంత్రి పేర్నినానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. ఏ తప్పు చేయకపోతే తన మేనేజర్తో హైకోర్టులో క్వాష్ పిటీషన్ ఎందుకు వేయించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Andhrapradesh: నీతులు చెప్పే మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం కుంభకోణంపై ఏం సమాధానం చెబుతారని మంత్రి కొల్లు రవ్రీంద ప్రశ్నించారు. రూ.90 లక్షల విలువైన బియ్యం మాయం చేసి పారిపోయారని విరుచుకుపడ్డారు. పోయిన బియ్యానికి డబ్బులు చెల్లిస్తామని తన దోపిడీని ఒప్పుకున్నారన్నారు.
తన పాలనలో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదేనని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. సీఎం చంద్రబాబు గురించి, విజన్ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం చోటు చేసుకుంది. మంత్రి సోదరుడు కొల్లు వెంకటరమణ(64)కు బుధవారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం జరిగిన స్కాములను త్వరలోనే బయట పెడతామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఇప్పటికే 12 సీబీఐ, 9 ఈడీ కేసుల్లో ఉన్న జగన్ రెడ్డి, విజయ సాయి రెడ్డి లాంటి వారు ఉన్నారని చెప్పారు. వారు చంద్రబాబు గురించి మాట్లాడే కనీస అర్హత లేదని గుర్తుంచుకోవాలని చెప్పారు.
ఇది కలియుగం... కర్మ ఫలం ఎవరినీ వదలదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఈ జన్మలో చేసిన పాపాలకు కర్మ ఫలం ఈ రోజుల్లోనే అనుభవించే రోజులు వచ్చాయని హెచ్చరించారు.
ఏపీలో లిక్కర్ రేట్లు చాలా తక్కువ అని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. జగన్ ప్రభుత్వ లిక్కర్ పాలసీపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తి అయిందని అన్నారు. సీబీ సీఐడీ విచారణ కూడా చేస్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్లో భారీ దోపిడీ జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.
కృష్ణాజిల్లా, మచిలీపట్నం: కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ వద్ద సాగర హారతితో సముద్ర స్నానాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము 5 గంటలకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సముద్రుడికి హారతులు ఇచ్చి సముద్ర స్నానాలను ప్రారంభించారు.