Home » Kishan Reddy G
ఆర్థిక వనరుల సమీకరణ పేరిట తెలంగాణ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) ద్వారా ప్రభుత్వ భూములను వేలం వేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.
Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు. భూముల వేలం వేయొద్దని కోరారు. భూములను వేలం వేసే ఆలోచనను రేవంత్ ప్రభుత్వం విరమించుకోవాలని కిషన్రెడ్డి కోరారు.
దేశీయంగా పత్తి దిగుబడిలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణలో 2014-15 నుంచి 2024-25 వరకూ సీసీఐ ద్వారా రూ.58 వేల కోట్లపై చిలుకు విలువ గల పత్తి సేకరించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.
2024-25 రబీ సీజన్లో రైతులకు లోటు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎరువులను సరఫరా చేసిందని కిషన్రెడ్డి తెలిపారు. తెలంగాణకు 9.80 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, 12.02 లక్షల టన్నులను సరఫరా చేయడంతో రాష్ట్రంలో ఇంకా 1.68 లక్షల టన్నులు నిల్వ ఉన్నాయి
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాక భాష, ప్రాంతం పేరిట దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. చెన్నైలో జరిగిన సమావేశంలో డీలిమిటేషన్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడి మాట్లాడటం చూస్తుంటే వారి నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖకు వారంలోగా కొత్త అధ్యక్షుడి నియామకం జరగనుంది. ఉగాది పండుగలోపే నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉత్తరాది, దక్షిణాది అంటూ కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎ్సలు విభజన రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్రెడ్డి మండిపడ్డారు.
Kishan Reddy: సీఎం రేవంత్రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్లపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్ సమక్ష్యంలో ఇద్దరు ఒకటయ్యారని కిషన్రెడ్డి ఆరోపించారు.
అంకెల గారడీతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసింది. దున్నపోతుకు పాలు పిండినట్లుంది రాష్ట్ర బడ్జెట్. అట్టహాసంగా ప్రకటించిన గ్యారెంటీల అమలుపై ప్రజలు ఆశలు వదులుకునేలా పద్దుల రూపకల్పన ఉంది.
అప్పులు చేయడం, అవినీతికి పాల్పడటం, అసభ్యంగా మాట్లాడటంలో మాజీ సీఎం కేసీఆర్ కంటే ఏమీ తక్కువ తినలేదన్నట్లుగా సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మండిపడ్డారు.