Home » Khammam News
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం అయిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు. వర్షాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. అన్ని జిల్లాల్లో రోజంతా వర్షం పడుతూనే ఉండడంతో.. సగటు వర్షపాతం 9.82 సెంటీమీటర్లుగా నమోదైంది.
వర్షాల ధాటికి పొంగిప్రవహిస్తున్న వాగులో ప్రభుత్వ ఉద్యోగి ఒకరు గల్లంతయ్యాడు.
తెలంగాణలో రెండు రోజులుగా భారీ వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. వానలు ఏకధాటిగా పడుతుండటంతో ఖమ్మం నగరంలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు వాగుకు పై నుంచి వచ్చే నీటి తీవ్రతతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి.
రాఖీ పండుగ సందర్భంగా తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళుతూ ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.
తల్లాడ మండలం అన్నారుగూడెంలో 9మంది రైతు కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పొలంలో మందు చల్లుతూ తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో వారంతా అస్వస్థతకు లోనయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టుకి గోదావరి జలాలు తరలించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జిల్లాలోని 6.74లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తుమ్మల తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంటతడి పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన సీతారామ ప్రాజెక్టుకు.. ఇప్పుడు రిబ్బన్ కట్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారంటూ మాజీ మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలతో తుమ్మల మనస్తాపానికి గురయ్యారు.
కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లన్నింటినీ పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
సీతారామ ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక దశలో కంటతడి పెట్టుకున్నారు. ప్రచారం కోసం బటన్లు నొక్కే వ్యక్తిని తాను కాదని స్పష్టం చేశారు.