Home » Kejriwal
ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై ఆతిశీ ఆసీనులయ్యారు. శనివారం, ఇక్కడ రాజ్నివా్సలో జరిగిన కార్యక్రమంలో ఎల్జీ వినయ్కుమార్ సక్సేనా అతిశీతో ప్రమాణం చేయించారు.
ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. తన రాజీనామా నేపథ్యంలో.. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కొత్త సీఎం అభ్యర్థిని అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇవాళే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు కొత్త నేత పేరు ప్రతిపాదనను, పార్టీ మద్దతును ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి ఆయన తెలియజేసే అవకాశాలు ఉన్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాను కలవనున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి కాలం కొన్ని నెలలు మాత్రమే ఉన్నప్పటికీ.. కీలక అంశాలపై పార్టీ వైఖరిని స్పష్టం చేయాలనే ఉద్దేశంతో ఆప్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ శ్రేణుల్లో విస్తృత ఆమోదం ఉన్న నాయకుడు లేదా నాయకురాలని సీఎం పదవికి ఎంపిక చేయాలని చూస్తోంది. దీంతో కేజ్రీవాల్ వారసుడు ఎవరు? ఆయన జైల్లో ఉన్నంతకాలం ప్రభుత్వాన్ని చక్కబెట్టిన మంత్రి, పార్టీ సీనియర్ అతిషిని ఏకగ్రీవంగా ఎంపిక చేస్తారా?. ఇంకెవరినైనా వరిస్తుందా!!
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. ‘‘నేను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండను.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తాననడం ఢిల్లీ ప్రజల విజయంగా బీజేపీ అభివర్ణించింది. సుప్రీం ఆంక్షలు ఉన్నందునే ఆయన తన పదవిని వదులుకోవడానికి సిద్ధమైనట్లు ఆరోపించింది.
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఆయన అభిమానులు టపాసులు కాల్చి స్వాగతం పలికారు.
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కేజ్రీవాల్ తీహాడ్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. అనంతరం జైలు దగ్గర తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి ఓ వాహనం పై నుంచి మాట్లాడుతూ... జైలు గోడలు తన మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని, జైలుకు పంపాక తన మనోధైర్యం 100 రెట్లు పెరిగిందని చెప్పారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎట్టకేలకు బెయిల్ దక్కింది. ఈ మేరకు సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.