Home » Kejriwal
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు ఫిక్స్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మూడోసారి కూడా అడ్రస్ లేకుండా పోగా.. ఆప్ పార్టీ నాలుగోసారి ఢిల్లీ గద్దెనెక్కాలనే ఆశ ఆవిరైంది. ఈ నేపథ్యంలోనే జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆప్, కాంగ్రెస్ పార్టీల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కలసికట్టుగా ఉండనందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ మెజార్టీతో గెలుపు దిశగా అడుగులు వేస్తోంది బీజేపీ. ఇప్పటికే కమలం పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి ఖాయమైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏకంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ను ఓడించిన వ్యక్తి ఎవరా అని ఇప్పుడంతా ఆరా తీస్తున్నారు. కాబోయే ఢిల్లీ సీఎం పర్వేష్ వర్మ అనడంతో ఈయన పేరు ప్రస్తుతం దేశమంతటా హాట్ టాపిక్గా మారింది.
Delhi Election Results 2025: ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. అధిక్యం రౌండ్ రౌండ్కు మారుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొదలుకొని ఈవీఎం బ్యాలెట్ల వరకు ఆప్, బీజేపీ మధ్యనే ప్రధానపోటీ కనిపించింది. కాంగ్రెస్ పత్తా లేకుండా పోయింది.
దేశరాజధాని ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 6 వరకూ పోలింగ్ జరగనుంది. ఉదయం 11 గంటల వరకూ దాదాపు 20 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి పోటీపడుతున్న ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ పోలీసులపై ఫైర్ అయ్యారు. ప్రతి 200 మీటర్లకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలు ఓటు వేయడానికి ఎలా వస్తారు? అని ఆరోపణలు చేసారు.
దేశరాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఒకే విడతలో జరగనున్న 70 శాసనసభ స్థానాలకు ఇవాళ సాయంత్రం ఆరు వరకూ ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే రాష్ట్రపతి సహా అనేక మంది ప్రముఖ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో అందరూ భాగస్వాములు కావాలని ఢిల్లీ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆప్ పార్టీని లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటేసేటప్పుడు ప్రజలు ఈ విషయం గుర్తుచేసుకోవాలని సూచించారు..
1995లో హైదరాబాద్ ఎలా ఉండేదో ఆ పరిస్థితి నేడు ఢిల్లీ ఉందన్నారు. ఆదివారం ఢిల్లీలోని షహదారా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థుల తరపున....
యమునా జలాల్లో "విషం'' కలపడం ద్వారా ఢిల్లీ ప్రజలను హతమార్చాలని చూస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై హర్యానా కోర్టు బుధవారంనాడు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 17న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ను హత్య చేసేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఢిల్లీ సీఎం ఆతిషీ సంచలన ఆరోపణలు చేశారు.
CM Revanth Reddy: అబద్ధాలు ఆడటంలో ప్రధాని మోదీ, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఒకటేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు.ఢిల్లీలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇటు సీఎంగా కేజ్రీవాల్, అటు పీఎంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీకి చేసింది ఏమీ లేదని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు.
లిక్కర్ పాలసీ కేసులో బెయిలుపై విడుదలైన అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో అతిషి ముఖ్యమంత్రిగా గత సెప్టెంబర్ 23న బాధ్యతలు చేపట్టారు.