Home » Kejriwal
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలిపారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన రాహుల్.. అధైర్యపడొద్దని, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) ను ఈడీ అరెస్టు చేసింది. తన అరెస్టుపై కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను నేడు సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థ ఆయనను ఈడీ కోర్టులో హాజరుపరచనుంది.
ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఆమాద్మీ పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆప్ నేతలు గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్, సందీప్ పాఠక్, అతిషి మర్లీనా వెల్లడించారు.
లిక్కర్ స్కామ్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో న్యూ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ ముఖ్య కుట్రదారు అని మీడియాకు విడుదల చేసిన నోట్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత, ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్లతో కలిసి కుట్రకు తెరతీశారని వివరించారు. న్యూ ఎక్సైజ్ పాలసీతో సౌత్ లాబీకు భారీగా లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. అందుకు ప్రతీగా సౌత్ లాబీ ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల నగదు ఇచ్చిందని వెల్లడించారు.
Arvind Kejriwal Arrest: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఈడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటి నుంచి ఆయన ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆప్ కార్యకర్తలు అడ్డుకోబోగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు.
లిక్కర్ స్కామ్లో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. కొత్తగా రూపొందించిన ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఈడీ అధికారులు చెబుతున్నారు. కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడాన్ని ఆప్ నేతలు ముక్తకంఠంతో ఖండించారు.
CM Kejriwal: దేశ రాజధాని ఢిల్లీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఓవైపు సీఎం కేజ్రీవాల్(CM Kejriwal).. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు(ED).. పరిస్థితి తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Liquor Scam Case) సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేస్తుందని గట్టి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం..
దేశవ్యాప్తంగా సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం నమోదయ్యేలా కనిపిస్తోంది. సోదాలు కోసమంటూ ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీంతో కేజ్రీవాల్ నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయి.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈడీ అరెస్టు చేయకుండా నిలిపివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బలవంతపు చర్య (అరెస్ట్)లకు దిగవద్దని ఈడీని ఆదేశించాలని కోర్టును కోరారు.
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణకు రావాలంటూ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) కు ఈడీ తొమ్మిదో సారి సమన్లు జారీ చేసింది. దీనిని తీవ్రంగా తీసుకున్న ఆప్ అధినేత హైకోర్టును ఆశ్రయించారు. తనకు జారీ చేసిన అనేక సమన్లను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.