Home » Karnataka BJP
కర్ణాటకలో కలకలం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(Prajval Revanna) సెక్స్ స్కాండల్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. జాతీయ మహిళా కమిషన్(NWC) గురువారం మాట్లాడుతూ.. ఈ కేసులో ఫిర్యాదు చేసిన మహిళల్లో ఒకరు తనను బెదిరించి రేవణ్ణపై అసత్య ఆరోపణలు చేయించారని తమతో చెప్పినట్లు కమిషన్ తెలిపింది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar) కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెంప పగులగొట్టిన ఘటన కన్నడనాట రాజకీయ దుమారం రేపింది. హవేరి జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియోను కర్ణాటక బీజేపీ(BJP) సోషల్ మీడియా షేర్ చేసింది..
కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని క్షమించే ప్రసక్తే లేదని..
ఆంద్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిదే అధికారమని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు సీటీ రవి స్పష్టం చేశారు. ఈ లోక్సభ ఎన్నికల వేళ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు తమ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పారు.
ఈ లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిలోని అయిదు రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చెరీలో సైతం బీజేపీ తన సత్తా చాటుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. దక్షిణాదిలో మొత్తం 130 లోక్సభ స్థానాలు ఉన్నాయన్నారు.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 లోక్సభ స్థానలకుపైగా గెలుచుకుంటుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటుండగా.. మరోవైపు కొందరు నేతలు పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు మారుతున్నారు.
కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడిగి చేసిన కామెంట్స్ దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మోదీ మోదీ అని నినాదాలు చేసే యువతను చెప్పుతో కొట్టాలని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. గత నెలలో బెంగళూరు ( Bengaluru ) లోని తన నివాసంలో మైనర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న అభియోగాలపై అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో బీజేపీ (BJP) హైకమాండ్ ‘సర్జికల్ స్ట్రైక్’కు (Surgical Strike) దిగింది. ఏకంగా తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టేసి, వారి స్థానంలో కొత్తవారిని రంగంలోకి దింపుతోంది. ఇటీవల ప్రకటించిన రెండో జాబితాలో భాగంగా.. ఎనిమిది స్థానాలకు గాను కొత్త అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.