Home » KADAPA
వైఎస్సార్ కడప జిల్లా కాశినాయన మండలంలోని అవధూత కాశినాయన జ్యోతి క్షేత్రంలో కూల్చేసిన నిర్మాణాలను తిరిగి చేపడతామని మంత్రి లోకేశ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.
Varra Health Issues: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు రిమ్స్కు తరలించారు. ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వర్రాను.. ఈరోజు ఉదయం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన నివాసంలో 2019 మార్చి 15వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా కలిగించింది. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్న మృతిచెందారు.అయితే రంగన్న మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని ఆయన భార్య తెలిపింది.
Case on Posani Murali Krishna: వరుస కేసులతో టాలీవుడ్ నటుడు పోసాని మురళీకృష్ణ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని కోసం నరసరావుపేట పోలీసులు వచ్చారు.
కడప కొండల్లో ఆదిమానవుని ఆనవాళ్లు లభించాయి. క్రీస్తు పూర్వం 15వ శతాబ్దంలో జీవించిన మనిషి ఎలా ఉండేవాడు? ఏం తిన్నాడు? ఎలా తిన్నాడు? ఎక్కడ నివసించాడు?
Posani Health Police says : సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రాజంపేట సబ్ జైల్లో ఆరోగ్యం బాగాలేదంటూ లబోదిబోమంటూ గోల చేయడంతో హుటాహుటిన పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే పోసాని అనారోగ్యం పేరుతో ..
సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీకి రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ, జనసేన అగ్రనేతలపై అడ్డూ అదుపు లేకుండా నోరు పారేసుకున్న పోసానిపై కేసు నమోదు కావడంతో పోలీసులు అతనికి నోటీసు ఇచ్చి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళీని అరెస్టు చేసిన పోలీసులు గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లెలో పోలీస్ స్టేషన్కు తరలించారు. తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. అనంతరం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరుస్తారు. మండలి జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోసానిని అరెస్టు చేశారు.
Kadapa District: శివరాత్రి పర్వదినం వేళ.. ఉమ్మడి కడప జిల్లాలోని పోలతల క్షేత్రంలో దొంగ బాబాలు రెచ్చిపోయారు. దెయ్యలు, భూతాలు పేరిట మహిళలను ఉచ్చులోకి లాగారు. ఆ క్రమంలో వారిని విచక్షణారహితంగా కొడతున్నారు. వారి ఆర్తనాదాలతో సదరు క్షేత్రం మార్మోగుతోంది.
Amarnath Reddy: ‘‘ నాకు ఎలాంటి నోటీసులు అందలేదు.. నేను ఎలాంటి విచారణకు హాజరుకాను’’ అని స్పష్టం చేశారు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. భూకబ్జాలపై స్పందించిన ఎమ్మెల్యే.. తాను ఏ భూములను ఆక్రమించలేదని చెప్పుకొచ్చారు.