Home » KADAPA
కడప గడపలో ఈనెల 27, 28, 29న నిర్వహించే మహానాడును నభూతో నభవిష్యత్ నిర్వహించేందుకు టీడీపీ పక్కా ప్లాన్ చేస్తోంది. సోమవారం జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి చావు దెబ్బ కొట్టింది. మిత్రపక్షాలతో కలిసి మట్టికరి పించింది.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి నుంచి తిరుపతికి మరో 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మే 8 నుంచి ఈ రైళ్లు నడుస్తాయని, అలాగే ఈ ప్రత్యేక రైళ్లు నిర్ణిత స్టేషన్లలో మాత్రమే ఆగుతాయని రైల్వేశాఖ తెలిపింది.
Kadapa MLA PA Cheating: ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళను కడప ఎమ్మెల్యే పీఏ వాహిద్ మోసం చేసి రెండవ పెళ్లి చేసుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం, డబ్బులు ఇస్తానని నమ్మించి సదరు మహిళను పెళ్లి చేసుకున్నాడు వాహిద్.
SIT Investigation: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై సిట్ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో సాక్షులుగా ఉన్న వారిని సిట్ విచారిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ ఆహార పథకంతో ఒప్పందం కుదుర్చుకున్నది. ముందుగా కడప జిల్లాలో చిన్న, సన్నకారు రైతుల కోసం వాతావరణ అనుకూలత కల్పించే ప్రాజెక్టును అమలు చేయనున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. రాపూరు తిక్కనవాటిక పార్క్ సమీపంలో ఓ ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న సురేశ్, అతని అత్త సరస్వతి అక్కడికక్కడే మరణించారు.
అన్నమయ్యజిల్లాలో విషాదం నెలకొంది. మైలపల్లెరాచపల్లెకు చెందిన ఏడేళ్ల వయసుగల ముగ్గురు బాలురు ఈతకు వెళ్లి నీటికుంటలో మునిగి చనిపోయారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా ఒంటిమిట్ట చేరుకుని ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి స్వామి వారి ప్రసాదం స్వీకరించారు.
సీతారాముల కల్యాణానికి కడప జిల్లా ఒంటిమిట్ట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శుక్రవారం జరుగనున్న కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. వేదిక ముందుభాగంలో వీవీఐపీ గ్యాలరీతో పాటు క్యూలైన్లు, ఆలయం వద్ద భారీగా చలువ పందిళ్లు సిద్ధం చేశారు. కల్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది. ఏలూరు, కడప రెండు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఈ రెండు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.