Home » KA Paul
ఏపీలో ఎన్నికలను ఏప్రిల్లో నిర్వహించి మేలో ఫలితాలిస్తుడటంతో ఈవీఎంలు మిస్ అవుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA PAUL) అన్నారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల అధికారిని కలిశానని.. ఎలక్షన్ను ఏప్రిల్లో నిర్వహించవద్దని కోరానని తెలిపారు. ఏపీకి ముగ్గురు ఎన్నికల కమిషనర్లను నియమించాలని కోరారు.
మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ హల్చల్ చేశారు. హైకోర్ట్లో పబ్లిక్ రైటికేషన్ పిల్ వేశానని, దాని మీద రేపు (మంగళవారం) విచారణ జరుగుతుందని అన్నారు. ‘‘ ఎలక్షన్ నిర్వహించడం కోసం ముగ్గురు కమిషనర్స్ ఉండాలి కానీ ఒక్కరే ఉన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎన్నికలు జరపకూడదు’’ అని అన్నారు.
ఏపీ సచివాలయంలోని ఐదో బ్లాక్ వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) గురువారం నాడు నిరసనకు దిగారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసేందుకు సచివాలయానికి కేఏ పాల్ వచ్చారు. అనుమతి లేదంటూ సెక్రటేరియట్ మెయిన్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత లోపలికి అనుమతించలేదు.
Telangana: ప్రముఖ నటుడు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ (Babu Mohan) ప్రజా శాంతి పార్టీలో (Praja Shanthi Party) చేరారు. సోమవారం పార్టీ చీఫ్ కేఏపాల్ సమక్షంలో బాబుమోహన్ పార్టీ కండువా కప్పుకున్నారు. కొద్ది రోజుల క్రితం బీజేపీకి గుడ్బై చెప్పిన మాజీ మంత్రి.. ఈరోజు ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Andhrapradesh: రుషికొండ వద్ద పలు భవనాలను ప్రభుత్వం ఈరోజు (గురువారం) ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రుషికొండకు వద్దకు చేరుకున్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ను పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండకు చేరుకున్న పాల్ను పోలీసులు అడ్డుకుని కారు దిగనివ్వకుండా చుట్టుముట్టారు.
Andhrapradesh: ప్రధాని మోదీ తిరుపతి సాక్షిగా స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారని.. కానీ ఆ మాట మర్చిపోయారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మతతత్వం పెంచుతున్నారని.. జై శ్రీరామ్ అనకపోతే చంపేస్తాం అంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేఏ పాల్ వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అందరూ నమ్ముతున్నారని అన్నారు. ఇదే సమయంలో.. చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుని ప్రస్తావించారు. ఎన్నికల బాండ్లలో క్విడ్ ప్రోకో ఉందని తాను అనేకసార్లు మీడియా సమావేశాల్లో చెప్పానని, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆ వ్యాఖ్యలే చేసిందని అన్నారు.
ఇటీవల వైసీపీ ‘సిద్ధం’ సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్పై వైసీపీ శ్రేణులు చేసిన దాడిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఖండించారు. మీడియాపై దాడి చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఇదే సమయంలో.. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తనతో చర్చలకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్కి సవాల్ విసిరారు.
విశాఖ: ‘నరేంద్రమోదీతో యుద్ధం-మన విశాఖ సిద్ధం’ అని ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నమ్మక ద్రోహంచేస్తున్నారని...ఆఖరికి తల్లి, చెల్లిని మోసం చేశారని ఆయన విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరవుతున్న వేళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ చేసిన కామెంట్లు ఇంట్రెస్టింగ్ గా మారాయి.