Home » Joe Biden
ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు(us presidential election 2024) జరగనున్నాయి. ఈ క్రమంలో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్(joe biden), అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(donald trump) మధ్య మొదటిసారిగా వాడివేడి చర్చ జరిగింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అప్పుడప్పుడు వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. గందరగోళంగా చూపులు చూడటం, వేదికపై మాట్లాడుతున్నప్పుడు బిగుసుకుపోవడం.. వంటి ఉదంతాలు..
ఇటలీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జీ-7 సమ్మిట్కు పలు అగ్రరాజ్యాల అధినేతలు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. అయితే అక్కడ ఆయన వింత ప్రవర్తన చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.
2024 అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్నకు కోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోర్న్ స్టార్కు రహస్యంగా డబ్బు చెల్లించిన హుష్ మనీ కేసులో అమెరికా కోర్టు అయనను దోషిగా తేల్చింది. మొత్తం 34 కేసుల్లో ట్రంప్ను కోర్టు దోషిగా తేల్చింది.
అరుదైన ఘటనకు అమెరికాలోని అధికార భవనం శ్వేత సౌధం (White House) వేదికగా మారింది. వందలాది ఆసియా అమెరికన్ల ముందు వైట్ హౌస్ మెరైన్ బ్యాండ్ మహ్మద్ ఇక్బాల్ రచించిన ‘సారే జహాసే అచ్ఛా’ను ప్లే చేయగా ఆహుతులంతా ఎంజాయ్ చేశారు. హెరిటేజ్ మంత్ వేడుకల్లో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. వచ్చిన అతిథులంతా పానీ పూరి తింటూ మరోవైపు సారే జహాసే అచ్చా వింటూ మురిసిపోయారు.
అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై హమాస్ చేసిన మెరుపుదాడులతో ప్రారంభమైన ‘గాజా యుద్ధం’ ఇంకా కొనసాగుతూనే ఉంది. తమపై ఉగ్రదాడులకి పాల్పడినందుకు గాను.. హమాస్ని అంతమొందించేదాకా వెనకడుగు వేసేది లేదని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ఎంత భద్రత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆయనపై ఈగ కూడా వాలనివ్వనంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అలాంటి వ్యక్తి ఉపయోగించే ‘ఎయిర్ఫోర్స్ వన్’ విమానంలో గత కొన్ని సంవత్సరాల నుంచి వరుస చోరీలు జరుగుతున్నాయి.
అగ్రరాజ్యం అమెరికా(america)లో ఈ ఏడాది నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు(us president elections) జరగనున్నాయి. దీని కోసం అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden), మాజీ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(donald trump) పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య రసవత్తరమైన ఎన్నికల ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ (Joe Biden) ఈ ఏడాది చివరిలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం ఖరారైంది. ఈ మేరకు బుధవారం ఆయన నామినేట్ అయ్యారని అమెరికా మీడియా పేర్కొంది. అధ్యక్షుడిగా నామినేషన్ దాఖలు చేయడానికి 1,968 మంది ప్రతినిధుల ఓట్లు అవసరమవ్వగా తాజాగా జార్జియా రాష్ట్రంలో డెమొక్రాటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ అర్హత సాధించారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఇజ్రాయెల్, హమాస్ (Israel Hamas War) మధ్య యుద్ధం ప్రారంభమైనప్పుడు.. అగ్రరాజ్యం అమెరికా (America) ఇజ్రాయెల్కే (Israel) మద్దతు తెలిపింది. ఆ దేశానికి తనవంతు సహకారం అందించింది. కానీ.. గాజాలో (Gaza Strip) అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంతో, అమెరికా స్వరం మారింది. క్రమంగా ఆ అగ్రరాజ్యం ఇజ్రాయెల్ తీరుని తప్పుపడుతూ వచ్చింది.