Home » JNTU
జర్మనీలోని రౌట్లింగన్ యూనివర్సిటీతో జేఎన్టీయూ కుదుర్చుకున్న ఎంఓయూ ప్రోగ్రామ్లన్నీ విద్యార్థులకు మేలు చేకూర్చేవేనని వీసీ కిషన్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
జేఎన్టీయూ ‘వన్టైమ్ చాన్స్’ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. బీఫార్మసీ, ఎంబీఏ, ఎంటెక్ కోర్సుల్లో 50 శాతానికిపైగా, బీటెక్లో 44.35 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
బీటెక్ ఫస్టియర్ తరగతులను ఈ నెల 11నుంచే ప్రారంభించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. వాస్తవానికి ఈ నెల 14నుంచి తరగతులను ప్రారంభించాలని వర్సిటీ ఉన్నతాధికారులు ముందుగా భావించినప్పటికీ, బుధవారం జరిగిన అకడమిక్ సెనేట్ సమావేశంలో 2025-26 విద్యా క్యాలండర్లో స్వల్ప మార్పులను సభ్యులు సూచించారు.
జేఎన్టీయూ వర్సిటీ అనుబంధ, అఫిలియేటెడ్ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈసారి బీటెక్ ఫస్టియర్లో చేరుతున్న విద్యార్థులకు జేఎన్టీయూ తీపికబురు చెప్పింది.
ఇంజనీరింగ్ విద్యలో ఒరవడులకు శ్రీకారం చుడుతూ జేఎన్టీయూ సరికొత్త సిలబస్ను, నూతన మార్గదర్శకాలను రూపొందించింది. ఆర్ 25 రెగ్యులేషన్స్ కోసమని ఏడాదిగా కసరత్తు చేస్తున్న వర్సిటీ అకడమిక్ అఫైర్స్ అధికారుల, నిపుణుల కమిటీ కసరత్తు కొలిక్కి వచ్చింది.
విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల్లో వ్యవస్థాపక నైపుణ్యాలను, స్టార్టప్ కల్చర్ను ప్రోత్సహించడమే లక్ష్యమని ఐఐటీ-ఢిల్లీలోని ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ (ఫిట్) ప్రతినిధులు తెలిపారు. బుధవారం ఐఐటీ ఢిల్లీ నుంచి జేఎన్టీయూకు వారు చేరుకున్నారు.
జేఎన్టీయూ ‘వన్టైమ్ చాన్స్’ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు జేఎన్టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు స్పందిస్తూ.. రెండు రోజుల్లో ఫలితాలను విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు.
పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా తయారైంది ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థుల పరిస్థితి. జేఎన్టీయూ పరిధిలోని కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికి వదిలేస్తున్నాయి. జేఎన్టీయూ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
జేఎన్టీయూ వన్టైమ్ చాన్స్లో పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం రెండు నెలలుగా ఎదురు చూపులు తప్పడం లేదు. వాస్తవానికి జూన్ నెలఖరులోగా ఫలితాలను ప్రకటించాలని వర్సిటీ ఉన్నతాధికారులు భావించగా, కొన్ని సబ్జెక్టులకు జవాబు పత్రాల మూల్యాంకనం చేసేందుకు ఆచార్యులు దొరకని పరిస్థితి ఉన్నట్లు తెలిసింది.
జియో స్పేషియల్ సైన్స్ రంగంలో జేఎన్టీయూ(JNTU) చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.