Home » Jammu and Kashmir
Pahalgam Terror Attack: ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్పై రివేంజ్కు సిద్ధమైంది. ఇప్పటికే సింధు జలాలను పాకిస్తాన్కు సరఫరా కాకుండా నిలిపి వేసింది. పాకిస్తానీల వీసాలను సైతం రద్దు చేసింది. 48 గంటల్లో పాకిస్తానీలు ఇండియా వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. అంతేకాదు.. మెడికల్ వీసాలను కూడా రద్దు చేసింది.
భారత సైన్యం, పోలీసులు, సీఏపీఎఫ్ఎస్ల ధైర్యసాహసాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, ఉగ్ర దాడులకు పాల్పడిన వారితో పాటు వారికి సహాయసహకారాలు అందిస్తున్న మొత్తం నెట్వర్క్ను నామరూపాలు లేకుండా చేయాలని ఆర్మీ చీఫ్ ద్వివేదిని ఎల్జీ సిన్హా కోరారు.
YS Sharmila: మోదీ ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నలవర్షం కురిపించారు. బీజేపీ మత రాజకీయాల కోసం ఉగ్రదాడుల ఘటనను వాడుకుంటుందని.. ఇది చాలా బాధాకరమని వైఎస్ షర్మిల అన్నారు.
రాహుల్ గాంధీ కశ్మీర్ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులతో పాటు వాణిజ్య, పర్యాకక రంగం ప్రతినిధులను కలుసుకోన్నారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను వేర్వేరుగా కలుసుకుంటారు.
పల్టాన్ బజార్ వంటి కీలక ప్రాంతాల్లో ప్రధానంగా ఆర్మీ, పారామిలటరీ యూనిఫాం అమ్మకాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో దుకాణాల యజమానులు అమ్మకాలు జరిపే మందుకు సమగ్ర వెరిఫికేషన్ జరపాలని సింగ్ ఆదేశించారు.
Minister Nadendla Manohar: ఉగ్రవాదుల దుశ్చర్యలకు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పి తీరుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వారికి సహకరించిన వారిపై కూడా చర్యలు ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
కశ్మీర్లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్ర దాడి వెనక లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ ఉన్నట్టు తెలుస్తోంది. 26/11 దాడుకులకు కారణమైన హఫీజ్ ఈ ఉగ్రబృందాలను నేరుగా పర్యవేక్షించి ఉండొచ్చని సమాచారం.
పహల్గాం దాడిలో పాక్ ప్రమేయం ఉందని వాషింగ్టన్ అనుకుంటోందా? ఉద్రిక్తతలను తగ్గించే విషయంలో అమెరికా పాత్ర ఏవిధంగా ఉండనుందని అడిగినప్పుడు, పరిస్థితిలు వేగంగా మారుతున్నట్టు చూస్తున్నామని, వాటిని నిశితంగా గమనిస్తు్న్నామని బ్రూస్ చెప్పారు.
CM Revanth Reddy: ఉగ్రదాడికి నిరసనగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం నాడు హైదరాబాద్లో క్యాండిల్ ర్యాలీ తీయనున్నారు. ఈ ర్యాలీలో మంత్రులు, కాంగ్రెస్ నేతలు భారీగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అమరవీరులకు నేతలు నివాళి అర్పించనున్నారు.
హవల్గాం ఉగ్రదాడిలో26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో అధికారులు వైష్ణోమాత ఆలయానికి వెళ్లే మార్గంలో వెరిఫికేషన్ను మరితం తీవ్రం చేసారు. రిజిస్టర్డ్ సర్వీస్ ప్రొవైడర్లు ఆథరైజ్డ్ డాక్యుమెంట్లు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.