Home » Israel
అమెరికా, ఇజ్రాయెల్తో రెండు వారాలుగా సాగుతున్న భీకర యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే, అందుకు మూడు షరతులు విధించింది.....
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల ప్రభావం.. ఊహించినట్లుగానే భారత్పై పడుతోంది.
బ్యారెల్ ముడి చమురు ధర 200 డాలర్లకు చేరితే తట్టుకునే ధైర్యం ఉంటే యుద్ధాన్ని కొనసాగించాలని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రతినిధి అమెరికాకు సవాలు విసిరారు.
ఇజ్రాయెల్, అమెరికా జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత కొత్త నేతను ఎన్నుకునేందుకు అక్కడి ప్రభుత్వంలోని అగ్ర నేతలు ప్రయత్నిస్తున్నారు.
గల్ఫ్ దేశాలపై దాడుల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆదివారంనాడు తెలిపారు. పొరుగు దేశాలు దాడులు జరిపితే తమ దేశ రక్షణ కోసం ప్రతిస్పందించాల్సి వస్తుందని వివరించారు.
లెబనాన్ రాజదాని బీరుట్పై ఇజ్రాయెల్ ఆదివారంనాడు బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో సర్ అల్ ఘార్బియా టౌన్లోని మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో సుమారు 19 మంది మృతిచెందారు.
టెహ్రాన్లో ఇంధన నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇది యుద్ధమా? ప్రళయమా? అంటూ జనాలు నివ్వెరపోయేలా చేస్తున్నాయి.
ఇరాన్లోని శుద్ధి చేసిన యూరేనియంను స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక దళాలను రంగంలోకి దింపడంపై అమెరికా, ఇజ్రాయెల్లు చర్చిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ ఇరాన్ను మరోసారి హెచ్చరించారు. ఇరాన్ కోసం మరిన్ని సర్ప్రైజ్లు ఎదురు చూస్తున్నాయని అన్నారు. అక్కడి నిరంకుశ పాలన అంతమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు కూడా ఇజ్రాయెల్ వాయుసేన జరిపిన తొలి దాడుల్లో గాయపడినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 26వ తేదీన ఇరాన్పై ఆపరేషన్ లయన్స్ రోర్ పేరుతో ఇజ్రాయెల్ వాయుసేన దాడులకు దిగిన సంగతి తెలిసిందే.