Home » Israel
ఇరాన్తో ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణపై అమెరికా స్పష్టమైన ప్రకటన చేసింది. ఇది ఎల్లకాలం ఉండదని తేల్చి చెప్పింది. ఇరాన్ తన బాధ్యతలను నెరవేర్చడానికి ఒక నిర్దిష్ట సమయం మాత్రమే కేటాయించామని పేర్కొంది.
'ఎక్కువ ట్వీట్లు.. ఎక్కువ మాటలు'.. ట్రంప్ చేసే సోషల్ మీడియా పోస్ట్లు, ఆయన ఇచ్చే ప్రకటనలు చాలా అయోమయంగా, పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ఇరాన్ మంత్రి ఖతీబ్జాదే ఎద్దేవా చేశారు.
ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ ఇవాళ (శనివారం) మళ్లీ మూసివేసింది. లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత శుక్రవారం రోజే ఈ మార్గాన్ని తెరిచిన ఇరాన్, కేవలం 24 గంటల వ్యవధిలోనే మళ్లీ పాత ఆంక్షలను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
సుదీర్ఘ ఉద్రిక్తతల తర్వాత లెబనాన్ - ఇజ్రాయెల్ మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకారం కుదరడంతో లెబనాన్ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే సరిహద్దు ప్రాంతాల ప్రజలు, నిర్వాసితులు తమ నివాసాలకు పయనమయ్యారు.
పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ గురువారం ఫోన్ ద్వారా చర్చలు జరిపారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య 10 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ అమలులోకి రానున్నట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు.
యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కాల్ తరువాత చర్చల్లో పీటముడి పడిందంటూ ఇరాన్ వార్తా సంస్థ ఒకటి ప్రచురించిన కథనం ప్రస్తుతం సంచలనం కలిగిస్తోంది.
యూఎస్-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని గాంధీ ఆసుపత్రి దెబ్బతిందంటూ ఇరాన్ తాజాగా ఒక వీడియోను షేర్ చేసింది.
ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలించకపోవడంతో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దాదాపు నలభై రోజుల పాటు అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో దాదాపు 3375 మంది మరణించినట్టు ఇరాన్ తెలిపింది.
తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఇజ్రాయెల్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పలేకపోతే.. మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీస్తే.. ఇజ్రాయెల్పై దాడి చేయటం తమ కర్తవ్యం అని అన్నారు.