Home » Israel
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ బ్రిటన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడులకు దిగిన నేపథ్యంలో... ఇరు దేశాలు తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని బ్రిటన్ విదేశాంగ మంత్రి వైవెట్ కూపర్ పిలుపునిచ్చారు.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక కీలక దౌత్యపరమైన ముందడుగు పడింది. వాషింగ్టన్లో జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం, ఇజ్రాయెల్, లెబనాన్ ప్రభుత్వాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ గనుక అమెరికా సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడితే, ఆ దేశంపై మళ్లీ పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించడానికి అది మంచి కారణంగా మారుతుందని హెచ్చరించారు.
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాలుస్తూనే ఉన్నాయి. కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేపట్టింది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. లెబనాన్లో ఇజ్రాయెల్ చేపట్టిన తాజా సైనిక చర్యల నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య ఉద్రిక్తతలు పెరిగినట్లు తెలుస్తోంది.
యూఎస్తో చర్చలను ఇరాన్ నిలుపుదల చేసినట్టు అక్కడి మీడియా సంస్థ తాజాగా ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. హోర్ముజ్ను మళ్లీ మూసేయడంతో పాటు ఇతర జలసంధులను కూడా టార్గెట్ చేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది.
అమెరికా ప్రయోగించిన కఠినమైన సైనిక చర్యలు, బలమైన ఆర్థిక ఒత్తిళ్ల వల్లే.. ఇరాన్ చివరకు తమ అణు కార్యక్రమంపై చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చిందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ స్పష్టం చేశారు. ఇది.. అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన విజయమన్నారు.
ఇజ్రాయెల్ మరోసారి హమాస్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని గాజాలో భారీ వైమానిక దాడి చేపట్టింది. హమాస్ సైనిక విభాగం కొత్త చీఫ్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ ఒడెహ్ ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. లెబనాన్ దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 31 మంది మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
ఇరాన్- అమెరికా యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించడం ద్వారా ఏదో ఒక రకమైన లబ్ది పొందాలని భావించిన పాక్.. ఇప్పుడు అడ్డకత్తెరలోపడింది. ట్రంప్ పెట్టిన కొత్త మెలికతో ఏం చేయాలో పాలుపోక మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాల్సిన పరిస్థితి పాకిస్తాన్కు దాపురించింది..