Home » International News
పశ్చిమాసియాలో నెల రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధం ముగింపు దశకు చేరుకునేలా కనిపిస్తోంది. శాంతి చర్చలకు ఇప్పటికే అమెరికా మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇరాన్ కూడా అదే తరహాలో స్పందించింది.
భారత సంతతికి చెందిన టెక్నాలజీ నాయకురాలు మంగళ కుప్పా యూఎస్ కార్మిక శాఖ ముఖ్య సమాచార అధికారిగా నియమితులయ్యారు. గతేడాది అక్టోబరు నుంచి తాత్కాలిక హోదాలో పనిచేసిన ఆమెకు పూర్తి స్థాయి సీఐవో బాధ్యతలు అప్పగించారు.
యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతుండటంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసహనంతో ఉన్నారా? హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు క్లిష్టమైన, భారీ స్థాయి దాడులు తప్పవని....
మార్క్ సుబ్బారావు నార్త్ కరొలినా రాష్ట్రం షార్లెట్లో ఉపాధ్యాయుల సుబ్బారావు, రెజీనా దంపతులకు జన్మించారు. న్యూజెర్సీలోని మోరిస్టౌన్లో హైస్కూల్ చదువు పూర్తి చేశారు.
ఇన్వెస్టిగేషన్స్ ఎడిటర్, ఏఐ శిక్షకుడు సుధాకర్ రెడ్డి ఉడుముల భూటాన్లో జరిగిన కృత్రిమ మేధస్సు, మీడియా, డిజిటల్ మార్పులపై నిర్వహించిన కీలక సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో శిక్షకుడిగా, ప్యానెల్ స్పీకర్గా ఆయన కీలక ప్రసంగం చేశారు.
భారత్లో పలు ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ సంస్థకు గట్టి దెబ్బ తగలింది. ఆ సంస్థ అధినేత మసూద్ అజహర్ సోదరుడైన మహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్థాన్లో మరణించాడు.
ఇరాన్ అణు కేంద్రక నగరం ఇస్ఫహాన్పై అమెరికా భీకర దాడులు చేసింది. ఆయుధాలు ఉన్న ఓ డిపోపై బంకర్ బస్టర్లతో దాడి చేసింది. రెండు వేల పౌండ్ల బంకర్ బస్టర్లతో దాడులు చేయడంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి.
ఇరాన్ గనక తమతో త్వరలో ఒప్పందం కుదుర్చుకొని, హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే.. ఆ దేశానికి అత్యంత కీలకమైన ఖార్గ్ దీవిని, చమురు బావులను, ఇరాన్ విద్యుదుత్పత్తి కేంద్రాలను పేల్చేస్తామని, సర్వనాశనం చేసేస్తామని అమెరికా....
ఇరాన్కు అత్యంత కీలకమైన, ఆర్థిక జీవనాడి అయిన ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఒక్కసారి తీవ్ర దాడులు మొదలుపెడితే, ఖర్గ్ ద్వీపాన్ని చాలా తేలికగా స్వాధీనం చేసుకుంటామని అన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ జనజీవనం స్తంభించిపోయింది. ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఇరానీయులు సరిహద్దులు దాటి దక్షిణ ఇరాక్లోకి ప్రవేశిస్తున్నారు.