Home » Indians
తొలి దఫాగా జూన్ 17న ఉత్తర ఇరాన్ నుంచి అక్కడి భారత రాయబార కార్యాలయం విజయవంతంగా అర్మేనియాకు తరలించిన 110 మంది భారతీయ విద్యార్థులను భారత్కు తీసుకువస్తున్నారు.
ప్రస్తుతం సుమారు 10,000 మంది భారతీయులు ఇరాన్లో ఉన్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. వీరిలో 6,000 మంది విద్యార్థులు ఉన్నారు. భద్రతా కారణాల దృష్ఠ్యా భారతీయులను తరలిస్తున్నట్టు విదేశాంగ తెలిపింది.
MP Raghunandan Rao: పాకిస్తాన్కి బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ పది రోజుల్లో ప్రపంచ చిత్రపటంలో లేకుండా పోతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ పౌరులను ఇబ్బందులు పెట్టలే...ఉగ్రవాద సెంటర్లో శిక్షణ ఇస్తున్న వాటిని మాత్రమే ధ్వంసం చేశామని స్పష్టం చేశారు.
ట్రంప్ విధించిన వలస ఆంక్షల నేపథ్యంలో భారతీయ టెకీ ఉద్యోగులకు అమెరికా కంపెనీలు స్వదేశ ప్రయాణం మానుకోవాలని హెచ్చరికలు జారీ చేశాయి. వీసా పొడిగింపుపై అనిశ్చితి పెరిగిన నేపథ్యంలో, వెళ్ళిన వారికీ తిరిగి వచ్చే అవకాశం ఉండకపోవచ్చని సూచిస్తున్నారు
భారతీయ వలసదారుల పట్ల అమెరికా అధికారులు అనుచితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై అడిగినప్పుడు, ఈ విషయమై అమెరికాకు తమ ఆందోళనను తెలియజేశామని మిస్రీ సమాధానమిచ్చారు. భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా సంప్రదింపులు కొసాగిస్తున్నామని చెప్పారు.
భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలటరీ సీ-17 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ బుధవారం మధ్యాహ్నం 1.55 గంటలకు పంజాబ్లోని అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తొలి బ్యాచ్లో 30 మంది పంజాబ్కు చెందిన వారున్నారు.
విషవాయువు పీల్చి 12 మంది భారతీయులు మృతిచెందిన విషయన్ని టిబ్లిసిలోని భారత రాయబార కార్యాలయం అధికారులు ధ్రువీకరించారు. అయితే, మృతుల్లో 11 మంది విదేశీయులని, ఒకరు తమ పౌరుడని జార్జియా అధికారులు ప్రకటించారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతుంది. మంగళవారం ఇజ్రాయెల్పై ఇరాన్ భారీగా క్షిపణి దాడులకు దిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని భారతీయ రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు బుధవారం కీలక సూచన చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది.
ఇజ్రాయెల్లో ఉంటున్న భారత సంతతి పౌరులు అప్రమత్తంగా ఉండాలని, సేఫ్టీ ప్రోటాకాల్స్ను పాటించాలని ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ఒక అడ్వయిజరీ జారీ చేసింది. మధ్యప్రాశ్చంలోని ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ఉద్రిక్తలు పెరుగుతుండటంతో ఇండియన్ ఎంబసీ ఈ అడ్వయిజరీ జారీ చేసింది.
ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు విదేశాలకు పయనమవుతున్న వారి సంఖ్య రోజురోజుకు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. అయితే అలా ఉన్నత విద్య కోసం వివిధ విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థుల్లో పలువురు వివిధ కారణాల వల్ల మృత్యువాత పడుతున్నారు.