Home » India vs South Africa
మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్, 32 పరుగుల తేడాతో ఓటమిపాలడంపై క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Team India: 2023లో టీమిండియా అద్భుతంగా ఆడింది. ఈ ఏడాది అనేక విజయాలను సొంతం చేసుకుంది. వన్డే వరల్డ్కప్ సాధించలేకపోయినప్పటికీ..ఈ ఏడాది చెరగని ముద్రవేసింది. విశ్వకప్లో వరుసగా విజయాలు సాధించింది. గ్రూప్ దశలో టాపర్గా నిలిచింది. సెమీస్లోనూ తడాఖా చూపించింది.
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పుడు అప్పుడు అంటున్నారు కానీ హార్దిక్ పాండ్యా ఎప్పుడూ కోలుకుంటాడనే అంశంపై ఎలాంటి స్పష్టత రావడం లేదు. వచ్చే నెలలో అఫ్ఘానిస్థాన్తో జరిగే టీ20 సిరీస్ నాటికి హార్దిక్ పాండ్యా కోలుకుంటాడని అంతా భావించారు.
KL Rahul: మిగతా భారత బ్యాటర్లు విఫలమైన చోట టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. 92 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చి రాహుల్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లతో కలిసి విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు.
Virat Kohli: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ రికార్డును సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. సౌతాఫ్రికాతో మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కోహ్లీ 38 పరుగులు చేశాడు. దీంతో భారత్, సౌతాఫ్రికా టెస్టు క్రికెట్ పోటీలో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్గా మూడో స్థానానికి చేరుకున్నాడు.
Virat Kohli: సౌతాఫ్రికాతో మొదలైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్లో 38 రన్స్ చేసిన విరాట్ కోహ్లీ డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు నెలకొల్పారు.
ఆసక్తి రేపిన భారత్, సౌతాఫ్రికా టెస్టు సిరీస్ ప్రారంభమైంది. మంగళవారం నుంచి ప్రారంభమైన మొదటి టెస్టులో తొలి రోజు టీమిండియా బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆరుగురు బ్యాటర్లు, నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ కాంబినేషన్తో బరిలోకి దిగింది.
Boxing Day Test: టీమిండియాతో తొలి టెస్ట్ మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మొదట బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఈ మ్యాచ్తో తమ జట్టు నుంచి నాండ్రే బర్గర్, డేవిడ్ బెడింగ్హామ్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి అరంగేంట్రం చేస్తున్నట్టు చెప్పాడు.
క్రికెట్లో బాక్సింగ్ డే కు మంచి ప్రాముఖ్యత ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఏడాది బాక్సింగ్ డే రోజున ముఖ్యమైన టెస్ట్ మ్యాచ్లు ప్రారంభవుతుంటాయి. వాటిని బాక్సింగ్ డే టెస్టులు అని పిలుస్తుంటారు. ఆయా క్రికెట్ బోర్డులు కూడా బాక్సింగ్ డే రోజున తమ జట్ల మ్యాచ్లు జరిగేలా షెడ్యూల్ చేస్తుంటాయి.
దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు కీలక సవాలుకు సిద్ధమైంది. ఇప్పటికే టీ20 సిరీస్ను సమం చేసి, వన్డే సిరీస్ను గెలుచుకుని ఫుల్ జోష్లో ఉన్న టీమిండియా నేటి నుంచి ఆరంభమయ్యే టెస్టు సిరీస్లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.