Home » IMD
వర్షాల తిప్పలు, తుఫాను ముప్పుల గురించి నిత్యం మనల్ని హెచ్చరించి, అప్రమత్తం చేసే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 150వ వర్షంలోకి అడుగు పెట్టింది. ఈ వార్షిక వేడుకలు కొళత్తూర్లోని ఎవర్విన్ పాఠశాల ప్రాంగణంలో పాఠశాల యజమాన్యం, చెన్నై(Chennai) ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం జరిగాయి.
తూర్పు దిశ గాలుల వేగంలో మార్పుల కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి(Tamil Nadu, Puducherry)లో ఈ నెల 8వ తేది వరకు మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఇంకా నిష్క్రమించలేదు.
బంగాళాఖాతంలో మూడు రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం మూడు రోజుల తర్వాత పడమటి దిశగా వాయువ్య బంగాళాఖాతంలో శ్రీలంకకు దక్షిణదిశగా కదలనుందన్నారు.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఆంధ్రా కోస్తాతీరంవైపు మళ్ళిన బలమైన అల్పపీడనం తన దిశ మార్చుకుని చెన్నై(Chennai) వైపు కదలుతోందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం అల్పపీడనం మధ్య, పడమటి, నైరుతి దిశగా కదులుతోందని, దాని ప్రభావంతో మరో ఐదు రోజులపాటు రాష్ట్రంలో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి(Tamil Nadu, Puducherry) రాష్ట్రాల్లో వచ్చే ఆరు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్రరూపం దాల్చింది. ఇది రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా పయనించి దక్షిణ తమిళనాడు-దక్షిణ ఆంధ్రప్రదేశ్(Tamil Nadu-South Andhra Pradesh)లోని కోస్తా ప్రాంతాల మీదుగా పయనించనుంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని, దీని ప్రభావంతో ఈ నెల 20వతేదీ వరకు చెన్నై సహా 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
నీలగిరి(Neelagiri) జిల్లాలో మళ్ళీ కుండపోతగా వర్షాలు కురిశాయి. కొండ రైలు మార్గంలో చెట్లు కూలిపడటంతో ఊటీ - కున్నూరు(Ooty - Kunnur) మధ్య రైలు సేవలను రద్దు చేశారు. నీలగిరి జిల్లాలో ఫెంగల్ తుఫాన్ కారణంగా గత వారం భారీ వర్షాలు(Heavy Rains) కురిశాయి.
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం మన్నార్జలసంధి వద్ద తీరం దాటడం, ఈశాన్య రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చటంతో నగరంలో రెండు రోజుల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో తల్లడిల్లిన నగరవాసులు, శుక్రవారం వరుణదేవుడు కాస్త విశ్రాంతి తీసుకోవడంతో ఊరట చెందారు.
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం మన్నార్ జలసంధి తీరం వైపు కదులుతుండటంతో రాష్ట్రంలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తీవ్ర అల్పపీడనం వల్ల ఈశాన్య రుతుపవనాలు సైతం బలాన్ని పుంజుకున్నాయి.