Home » IMD
గత రెండు, మూడు రోజుల నుంచి వాతావరణం చల్లబడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా, భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.
భారత వాతావరణ శాఖ హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. గోల్కొండ, ముషీరాబాద్, చార్మీనార్, బహదూర్ పుర, బండ్లగూడ, అంబర్పేట, మారేడ్పల్లి, హిమాయత్ నగర్, షేక్ పేట్, ఖైరతాబాద్, సైదాబాద్ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
summer Heat: రోజు రోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికోడుతున్నాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మత్రం భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. అయితే ఈ వానలు ఎక్కడ ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దక్షిణాది జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy rains) కురువనున్నట్లు భారత వాతావరణ చెన్నై ప్రాంతీయ కేంద్రం అధికారులు ప్రకటించారు. దీంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని 12 జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. సచివాలయంలో గురువారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Weather Report: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయని భారత వాతావరణ శాఖ సూచించింది. వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతల్లో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయని తెలపిింది.
వర్షాల తిప్పలు, తుఫాను ముప్పుల గురించి నిత్యం మనల్ని హెచ్చరించి, అప్రమత్తం చేసే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 150వ వర్షంలోకి అడుగు పెట్టింది. ఈ వార్షిక వేడుకలు కొళత్తూర్లోని ఎవర్విన్ పాఠశాల ప్రాంగణంలో పాఠశాల యజమాన్యం, చెన్నై(Chennai) ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం జరిగాయి.
తూర్పు దిశ గాలుల వేగంలో మార్పుల కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి(Tamil Nadu, Puducherry)లో ఈ నెల 8వ తేది వరకు మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఇంకా నిష్క్రమించలేదు.
బంగాళాఖాతంలో మూడు రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం మూడు రోజుల తర్వాత పడమటి దిశగా వాయువ్య బంగాళాఖాతంలో శ్రీలంకకు దక్షిణదిశగా కదలనుందన్నారు.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఆంధ్రా కోస్తాతీరంవైపు మళ్ళిన బలమైన అల్పపీడనం తన దిశ మార్చుకుని చెన్నై(Chennai) వైపు కదలుతోందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం అల్పపీడనం మధ్య, పడమటి, నైరుతి దిశగా కదులుతోందని, దాని ప్రభావంతో మరో ఐదు రోజులపాటు రాష్ట్రంలో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు.