Home » HYDRA
ప్రభుత్వ అనుమతులున్న భవనాలను హైడ్రా(Hydra) కూల్చదని.. సర్వే నంబర్లు మార్చి, తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది, భూములు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై మాత్రమే చర్యలు ఉంటాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) స్పష్టం చేశారు. నగరవాసులకు మెరుగైన జీవనాన్ని కల్పించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా వందరోజులు పూర్తి చేసుకున్నదని కమిషనర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Telangana: రాష్ట్రంలో హైడ్రా ఏర్పాటై నేటికి వందరోజులు పూర్తి అయ్యింది. ఈ వందరోజుల్లో ఎన్నో అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. అలాగే హైడ్రాకు ప్రభుత్వం కూడా ఫుల్ పవర్స్ ఇచ్చేయడంతో ఇక తిరుగేలేకుండా పోయింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అనేక అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది.
‘‘భయపడకండి.. మీ ఇళ్లను ఎవ్వరూ కూల్చరు.. మీకు బీజేపీ అండగా ఉంటుందని గోల్నాక డివిజన్లోని మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఆ పార్టీ మెదక్ ఎంపీ రఘునందన్రావు(Medak MP Raghunandan Rao) భరోసా ఇచ్చారు.
కూకట్పల్లి(Kukatpally)లో హైడ్రా పేరు వింటేనే ఆక్రమణదారులు, ఫుట్పాత్ వ్యాపారుల గుండెలో వణుకు పుడుతోంది. హైడ్రా అధికారులను అడ్డుకునేందుకు ఏం చేయాలని, తమ వ్యాపారాలు పోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, స్వచ్ఛందంగానే తొలగించుకోవాల్సి వస్తుందా.. లేదంటే స్థానిక నాయకులతో చర్చించాలా అంటూ చిరు వ్యాపారులు చర్చించుకుంటున్నారు.
వర్షం పడితే నగరంలోని పలు ప్రాంతాలు నీట మునగడం, రహదారులు జలమయం కావడం వంటి సమస్యలకు ప్రధాన కారణం సరైన వరద ప్రవాహ వ్యవస్థ లేకపోవడంతో పాటు నాలాలు, స్ట్రామ్ వాటర్ డ్రైన్లలో వ్యర్థాలు తొలగించకపోవడమేనని అధికారులు గుర్తించారు.
భవన నిర్మాణాలకు సంబంధించిన సంస్థల నుంచి అనుమతి(చెల్లుబాటయ్యే అనుమతి) తీసుకొని చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
అనుమతులున్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేయబోదని ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు. చట్టబద్దమైన అనుమతులతో నిర్మాణాలు చేపట్టిన వారెవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. చెరువుల వద్ద అనుమతులున్న నిర్మాణాలను సైతం కూల్చివేస్తామంటూ ప్రచారం జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువుదీరింది. అయితే మూసీ నది పరివాహక ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది.
మూసీ సుందరీకరణ అనే పదం మాట్లాడిందే మొదట రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెప్పింది కూడా రేవంత్ రెడ్డినేనని అన్నారు. మూసీపై ప్రభుత్వం అస్సలు సర్వేనే చేయలేదని అన్నారు.
వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా, పాదచారుల భద్రత కోసం ప్రధాన రహదారుల్లో, కాలనీల్లో ఫుట్పాత్లను ఆకమ్రించిన శాశ్వత దుకాణాలను తొలగించేందుకు హైడ్రా(Hydra) సిద్ధమవుతోంది.