Home » HYDRA
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా శనివారం పోచారం మున్సిపాలిటీ పరిధిలో రహదారికి అడ్డుగా నిర్మించిన కాంపౌండ్ వాల్ను హైడ్రా అధికారులు కూల్చివేశారు..
Hydra: అక్రమ నిర్మాణాలపై దూకుడుగా ఉన్న హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాలపై ప్రజల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తుండటంతో మరో అడుగు వేసింది.
బుద్ధభవన్లోని హైడ్రా(HYDRA) కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. చెరువులు, పార్కులు, రోడ్ల ఆక్రమణలపై 89 ఫిర్యాదులు అందాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు కమిషనర్ ఏవీ రంగనాథ్ పౌరుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ(టీజీ-ఆగ్రోస్) కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఇదే పరిస్థితి..!
గత పాలకులు 1998 సంవత్సరంలో అరుంధతినగర్లో కుటుంబ నియంత్రన చేసుకున్న వారికి అప్పటి ప్రభుత్వం పట్టాలను ఇస్తే వాటిని కూల్చడం ఏమిటని మల్కాజిగిరి ఎంపీ ఈట ల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) రెవెన్యూ అధికారుల తీరుపై మండి పడ్డారు.
రాజధాని హైదరాబాద్లో హైడ్రా మరోసారి యంత్రాలకు పనిచెప్పింది. చెరువుల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపింది. మణికొండ మునిసిపాలిటీ పరిధి నెక్నాంపూర్ పెద్ద చెరువులో నిర్మాణంలో ఉన్న విల్లాలను శుక్రవారం నేలమట్టం చేసింది.
HYDRA: నెక్నాంపూర్ చెరువు బఫర్ జోన్లో నిర్మించిన నాలుగు విల్లాలను నేలమట్టం చేసిన హైడ్రా సిబ్బంది.. మరో ఐదు విల్లాలను కూల్చివేయడానికి సన్నద్ధమయ్యారు. అయితే నెక్నాంపూర్ చెరువును కబ్జా చేయడంతో గతంలో రెవన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు కూల్చివేశారు. మూడు సార్లు కూల్చివేసినా మళ్లీ అక్రమ నిర్మాణాలు వెలిశాయి.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా రంగంలోకి దిగింది. కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.
హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు తెలంగాన హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
HYDRA: ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణలపై నేరుగా ప్రజల నుంచి హైడ్రా చీఫ్ ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రజావాణి నిర్వాహణ ఉండనుంది. ఫిర్యాదుకు సంబంధిత ఆధారాలతో వస్తున్న ప్రజలు.. దాన్ని హైడ్రా చీఫ్కు అందజేస్తున్నారు.