Home » Guntur
Gorantla Police Custody: గుంటూరు కోర్టు ఆదేశాల మేరకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు మాజీ ఎంపీని విచారించనున్నారు.
పీఎస్ఆర్ ఆంజనేయులు గత ప్రభుత్వంలో ఏసీబీ డిజీగా ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే కాకుండా, గతంలో తనతో విభేదాలున్న వ్యక్తులు, మహిళలను తన అధికారాన్ని ఉపయోగించి తప్పుడు కేసులతో అరెస్ట్ చేసి వేధించారని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో విమర్శించారు.
గతంలో జనసేన పార్టీ తరపున జనవాణి కార్యక్రమం నిర్వహించిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. వివిధ రకాల సమస్యలతో జనవాణికి వచ్చిన ప్రజలను పవన్ కల్యాణ్ కలిసి వారి నుంచి వినతి పత్రాలు తీసుకొని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్బంగా టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిలో ఘనంగా బాబు పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆఫీసు వద్దకు చేరుకుని కేక కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు.
క్రీడల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు తెలిపారు. స్పోర్ట్స్ పాలసీలో పొందుపరిచిన స్పోర్ట్స్ కోటాను పెంచుతూ చంద్రబాబు సర్కార్ జీవో జారీ చేయడం శుభపరిణామం అని చెప్పుకొచ్చారు.
అమెరికాలో టెక్సాస్లో రోడ్డు ప్రమాదంలో గుంటూరు విద్యార్థిని వి.దీప్తి మృతి చెందింది. ఎంఎస్ పూర్తి కావాల్సిన సమయంలో ఈ విషాదం కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది
సీడీఎస్సీవో అనుమతి లేకుండా మార్కెట్లోకి వచ్చిన 35 రకాల ఎఫ్డీసీ మందులపై డీసీజీ ఆదేశాలు జారీ చేశాడు. ప్రజారోగ్యానికి ప్రమాదకరమైన ఈ మందులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు లేఖ పంపించారు
అమెరికాలోని టెక్సాస్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు, రాజేంద్ర నగర్కు చెందిన దీప్తి అనే విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె స్నేహితురాలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమెను గురజాలలో జడ్జి ఎదుట హజరు పరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విదిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమెను గుంటూరు జైలుకు తరలించారు.
ముద్దాయి మాదిరిగా స్టేషన్ గేట్లకు బేడీలు వేయడం ఏంటని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని అన్నారు.