Home » Guntakal
అర్హులైన పేదలందరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావు ల కేశవ్ పేర్కొన్నారు. ఇంటి స్థలాల పంపిణీ కోసం అవసరమైన, అ నువైన స్థలాలను మంత్రి శుక్రవారం పరిశీలించారు.
దశాబ్దాల తరబడి అర్చక వృత్తిలో ఉంటూ మండలకేంద్రంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి, కొత్తరాయుడుస్వామి ఆలయాల్లో స్వామివార్లకు సేవలు అందిస్తున్న అర్చకుడు హరికృష్ణశ ర్మను శుక్రవారం ఆర్యవైశ్యులు ఘనంగా సన్మానించారు.
పట్టణంలోని ప్రసిద్ధి చెందిన ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవా రం శ్రీవారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
సత్యసాయి తాగునీటి పథకంలో పని చేస్తున్న కార్మికుల సమ్మె నాలుగోరోజుకు చేరింది. శుక్రవారం పీఏబీఆర్ డ్యాం లోని సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు వద్ద కార్మికులు నిరసనకు దిగారు. వేతనాలు చెల్లించాలని, న్యాయ మైన కోర్కెలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
మండల పరిధిలోని పెన్న హోబిలం లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం లో స్వామి వారికి సుప్రభాతసేవ, అభిషేకాలు అర్చన, ఉత్సవ నిత్య హోమం, ప్రత్యేక పూజలు చేశారు.
ఆగ్నేయ రైల్వేలోని చంపా, జాంజ్గిర్ నలియా స్టేషన్ల వద్ద జరుగుతున్న సిగ్నలింగ్ పనుల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
శ్మశాన వాటిక రూపురేఖలు మారుద్దామని, పనులను త్వరగా పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని శ్మశాన వాటికను గురు వారం ఆయన పరిశీలించారు.
ఐదునెలలుగా వేతనాలు చెల్లించడం లేదంటూ సత్యసాయి నీటి పథకం కార్మికులు చేపట్టిన స మ్మె గురువారం కొనసాగింది. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా వారు రిలేదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ సత్యసాయిబాబా నీటి పథకాన్ని జిల్లా పరిషతకు అప్పగించవద్దని, ట్రస్ట్ ద్వారానే నడపాలని డిమాండ్ చేశారు.
పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరూ పాఠశాల్లో జరుగుతున్న ప్రత్యేక తరగతులకు హజరుకావాలని డీఈవో ప్రసాద్రావు సూచించారు. ఆయన గురువారం మండలకేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల్లో జరుగుతున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు.
మండల పరిధిలోని పెన్న హోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అశ్వవాహనంపై విహరించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి ఉత్సవ మూర్తులను మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి అ శ్వవాహనంపై కొలువుదీర్చారు.