Home » Gulf News
పశ్చిమాసియాలో యుద్ధ భయం పతాక స్థాయికి చేరుకున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు ఇచ్చిన గడువును పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్కు ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో వీరి మధ్య కీలక ఫోన్ సంభాషణ జరిగింది.
ఇరాన్కు ఇచ్చిన డెడ్లైన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో షాకింగ్ పోస్టు పెట్టారు.
గ్రీన్ ఆశా అనే మరో సరకు రవాణా నౌక సురక్షితంగా హోర్ముజ్ను దాటింది. ఎల్పీజీతో ఉన్న ఈ నౌక భారత్ వైపు బయలుదేరినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ తెరవడం, లేదా రాజీకి రావడంపై ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన పది రోజల డెడ్ లైన్ రేపటితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తన ట్రూత్ సోషల్లో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అయినా ఇరాన్ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోగా.. ట్రంప్ హెచ్చరికల్ని లైట్ తీసుకుంటోంది.
ఇరాన్, హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ ఈ తెల్లవారుజామున విరుచుకుపడింది. 340కి పైగా లక్ష్యాలు ధ్వంసం చేసింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్కి చెందిన ఆయుధాగారాలు, లెబనాన్లోని హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ స్థావరాలపైనా దాడులు తీవ్రతరం చేసింది.
ఇరాన్ ప్రతీకార దాడులకు సిద్ధమైంది. గల్ఫ్, జోర్డాన్లలోని 8 ప్రముఖ బ్రిడ్జ్లను ఐఆర్జీసీ టార్గెట్ చేసింది. ఈ మేరకు ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ఐఆర్జీసీ దాడులు చేయడానికి నిశ్చయించుకున్న బ్రిడ్జ్ల లిస్ట్ను రిలీజ్ చేసింది.
ఇరాన్ 'B1' బ్రిడ్జ్ దాడిపై స్పందించిన ట్రంప్.. దారికి రాకపోతే, మరిన్ని దాడులుంటాయని హెచ్చరించారు. ఈ దాడి శత్రువు నైతిక పతనాన్ని సూచిస్తుందని.. ఇలాంటి చర్యలు ఇరానియన్ల ధైర్యాన్ని దెబ్బతీయలేవని ఇరాన్ తేల్చి చెప్పింది.
యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన ట్రంప్ స్పీచ్ ఈ ఉదయం రానేవచ్చింది. ఇరాన్ ఆపరేషన్పై ట్రంప్ మళ్లీ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారు. ప్రధాన లక్ష్యాలను చేరుకున్నాం.. దాడులు కొనసాగుతాయనీ చెప్పుకొచ్చారు.
ఇరాన్ సుప్రీం లీడర్ అత్యంత సన్నిహిత సలహాదారు కమల్ ఖరాజీ తీవ్రంగా గాయపడ్డారు. ఖరాజీ నివాసంపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఖరాజీ భార్య ప్రాణాలు కోల్పోయారు. ఖరాజీ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.