Home » Gujarat Titans
ఐపీఎల్ IPL 2024(IPL 2024)లో నేడు 40వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మధ్య ఢిల్లీ(Delhi)లోని అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium)లో జరగనుంది. పాయింట్ల పట్టికలో ఇరు జట్లు దిగువన కొనసాగుతున్నాయి. ఈ విషయంలో వీరిద్దరూ ఈ మ్యాచ్లో గెలుపొందడం చాలా ముఖ్యమని చెప్పవచ్చు.
నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు విజృంభించారు. ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి.. వరుసగా వికెట్లు పడగొట్టారు. దీంతో.. తక్కువ స్కోరుకే గుజరాత్ జట్టు పేకమేడలా కూలింది.
యువ బౌలర్ యశ్ ఠాకూర్ ఓ సంచలన రికార్డ్ సృష్టించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఎవ్వరికీ సాధ్యం కాని ఫీట్ని తన పేరిట లిఖించుకున్నాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఈ లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి, మెయిడెన్ ఓవర్ చేసిన బౌలర్గా అవతరించాడు.
మార్కస్ స్టోయినీస్ హాఫ్ సెంచరీతో చెలరేగినప్పటికీ మిగతా బ్యాటర్లు అంతగా సహకరించకపోవడంతో గుజరాత్ టైటాన్స్ ముందు లక్నోసూపర్ జెయింట్స్ జట్టు 164 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. లక్నో బ్యాటర్లలో స్టోయినీస్(58) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కేఎల్ రాహుల్(33), నికోలస్ పూరన్ (32) పర్వాలేదనిపించారు.
కెప్టెన్ శుభ్మన్ గిల్ విధ్వంసానికి తోడు రాహుల్ తెవాటియా, సాయి సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్లతో చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ ముందు గుజరాత్ టైటాన్స్ 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ ఇన్నింగ్స్తో చెలరేగిన గిల్(89) అజేయ హాఫ్ సెంచరీతో గుజరాత్ భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్లో రెండు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి.
ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొట్టిన అతిథ్య జట్టు గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండ్ షోతో సన్రైజర్స్పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
ముంబై ఇండియన్స్తో జరిగిన చివరి మ్యాచ్లో సునాయసంగా 277 పరుగులు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్లు గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో మాత్రం తడబడ్డారు. గుజరాత్ బౌలర్లు కట్టడి చేయడంతో కనీసం ఒక బ్యాటర్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సన్రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు.
IPL 2024లో ఆదివారం (మార్చి 31) రెండు మ్యాచ్లు జరుగుతాయి. తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. అయితే రెండు జట్లు కూడా ఒక మ్యాచ్ గెలిచి రెండో గెలుపుపై కన్నేశాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు చుద్దాం.