Home » God
పట్టణ పరిధి లోని డీబీ కాలనీలో వెలసిని అష్టలక్ష్మీ ఆలయం ప్రథమ వార్షికోత్సవాలను బుధవారం ఘనం గా నిర్వహించారు. ఉదయం 6.30 గంటలకు ప్రాకారో త్సవం, 7 గం టల కు గణపతి ఆరాధ న, స్వస్తి పుణ్యాహవాచనం, నవ గ్రహ ఆరాధన, కలశ స్థాపన చేపట్టారు. అనంతరం మహాకుంభాభిషేకం, హో మాలు, పూర్ణాహుతి జరిపారు.
కోటంక సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. తలుపులు పగులగొట్టి రూ.7.80 లక్షలు విలువైన బంగారు, వెండి అభరణలను ఎత్తుకుపోయారు. గ్రామ సమీపంలోని గుంటికింద సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఏటా మాఘమాసంలో నాలుగువారాలు పాటు స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి ఆదివారం స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇంతటి ప్రఖ్యాత ఆలయంలో చోరీ జరగడం కలకలం రేపింది. ఆలయ ప్రధాన ద్వారాలను ఇనుప రాడ్లతో ద్వంసం ...
పట్టణంలోని దర్గా పేటలో వెలసిన నానబా దర్గాలో స్వామివారి గంధం మహోత్సవాన్ని మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధల తో ఘనంగా నిర్వహించారు. నానబా సాహెబ్ సహవర్దిని వంశీకుల ఆధ్వర్యంలో మతపెద్దలు, ఫకీర్లు వెంటరాగా గంధాన్ని ఊరేగింపుగా దర్గాకు తీసుకెళ్లి ప్రార్థనలు చేశారు.
త్యాగనిరతికి, దాన గుణానికి ప్రతీక బక్రీద్ పండుగ జామియా మసీదు మౌలానా అబ్దూల్ మన్నాన, ముతు వల్లి నూరుల్లా ఖాన, కోశాధికారి సిరాజ్ పేర్కొన్నారు. బక్రీద్ పర్వదినాన్ని సోమవారం పట్టణ పరిధిలోని అల్హిలాల్ పాఠశాల ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాం క్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మౌలానా బక్రీద్ విశిష్టతను వివరించారు.
పట్టణ పరిధిలోని లక్ష్మీపురంలో వెలసిన బాలాజీ ఆలయంలో గోదాదేవి, లక్ష్మీదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం ఆదివారం నయనానందకరంగా జరిగింది. ఈ సందర్బంగా ఉదయం స్వామి వారి మూల విరాట్కు వివిధ అభిషేకాలు చేసి బెంగళూ రు నుంచి తెప్పించిన పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అర్చనలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
మండలంలోని ఎర్రబల్లిలో గంగమ్మ జాతర వేడుకలను మంగళవారం ఘనం గా నిర్వహించారు. గ్రామస్థుల ఆధ్వర్యం లో గంగమ్మ నూతన ఆలయాన్ని నిర్మించి, విగ్రహ ప్రతిష్ఠ జరిగి 41రోజులు కావడంతో జాతర చేశారు.
పట్టణ పరిధిలోని రెండో మోడల్ కాలనీలో వెలసి న గంగమ్మ దేవత ఆలయంలో మంగళవారం జ్యోతుల మహో త్సవాన్ని ఘనంగా నిర్వహించా రు. ఈ కార్యక్రమం బెస్త సం ఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా తెలవారు జాము న నుంచే అమ్మవారి మూల విరాట్కు వివిధ అభిషేకాలు చేసి ప్రత్యేకంగా అలంకరిం చా రు. అర్చనలు తదితర పూజా కార్యక్రామలు చేశారు.
భక్తులు కొంగు బంగారంగా కొలిచే, నవగ్రహాలలో ఒకరై న శనీశ్వరుడి జ యంతిని గురువారం పావగడ శనీశ్వర ఆలయంలో ఘనం గా నిర్వహించారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన నల్ల గుడ్డ, నూగులతో ఉదయం 4గంటల కు తైలాభి షేకం చేశారు. అనంతరం సహస్రనామార్చన తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించారు. పావగడలో వెలసిన జేష్టదేవి సమేతుడైన శనీశ్వరుడిని పు ట్టినరోజు సందర్భంగా దర్శించుకుంటే పంచమ శని, అష్టమశని, ఏలినా టిశని, కాకి స్పర్శ తదితర దోషాలు తొలుగుతాయని, అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని భక్తుల విశ్వాసం.
మడకశిర ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన చందకచర్ల ఆంజనేయ స్వామి బ్రహ్మ రథోత్సవం శనివా రం అత్యంత వైభవంగా జరింగింది. ఈ సం దర్భంగా ఉదయం స్వామి వారికి వివిధ అభిషేకాలు చేసి ప్రత్యేకంగా అలంక రించా రు. అర్భనలు తదితర పూజలు చేశారు. ఆల యం ఆరణంలో హోమాలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు జ్యోతుల తో ఊరేగింపుగా తీసుకొచ్చి మొక్కులు తీర్చుకున్నా రు.
హనుమజ్జయంతి వేడుకలను ఆంజనేయ స్వామి ఆలయాల్లో శనివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే మూల విరాట్లకు వివిధ అభిషేకాలు, అర్చనలు, ఆకుపూజ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిం చారు. అలాగే హనుమాన చాలీసా పారా యణం, భజనలు, రామ కీర్తనలు, రామ నామం, ఆంజనేయ దండకంతో ఆలయాలు మార్మోగాయి. పలు ఆలయాల్లో సీతారామకల్యాణోత్సవం నిర్వహించారు.