Home » Ganta Srinivasa Rao
ఆంధ్రా యూనివర్సిటీ ప్రమాణాలను, ప్రతిష్టను వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిగజార్చారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ట్విటర్ వేదికగా విమర్శించారు. వైస్ ఛాన్సలర్గా కరుడుగట్టిన వైసీపీవాది ప్రసాదరెడ్డిని నియమించి ఈ గడిచిన ఐదేళ్లలో యూనివర్సిటీ ప్రతిష్టను అమాంతం దిగజార్చారని విమర్శించారు. గాంధీ విగ్రహం పక్కనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టించి యూనివర్సిటీని ఒక రాజకీయపార్టీ కార్యాలయంగా మార్చేశారని ఫైర్ అయ్యారు.
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ పైన, గత వైసీపీ ప్రభుత్వ పెద్దలకు కన్ను పడిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) తెలిపారు. విశాఖలో వ్యాపారాల పైన గత వైసీపీ ప్రభుత్వం దృష్టిపడిందన్నారు. సినిమాల్లో సంబంధం లేని వాళ్లు కూడా ఈ క్లబ్లో రాజకీయంగా ఇందులో చొరబడ్డారని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన టిడ్కో ఇళ్ల(Tidco Houses)ను ఆరు నెలల్లో పూర్తి చేసి ఇస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (MLA Ganta Srinivasa Rao) తెలిపారు. ఈ మేరకు ఆయన పీఎం పాలెం(PM Palem) టిడ్కో ఇళ్లను అధికారులతో కలిసి సందర్శించారు.
విశాఖలో రుషికొండ రాజభవనాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వ ఖర్చును వృథా చేసి అడంబరంగా కట్టారు. రుషికొండ భవనం ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఏ ప్రభుత్వం, ప్రజలు జగన్ చేసిన చర్యలను తప్పుబడుతున్నారు.
రుషికొండపై పర్యాటకులకు మధురానుభూతిని మిగిల్చే టూరిజం కాటేజీలను కూల్చి... కట్టిన ప్యాలస్లు! పేరుకే ఇది టూరిజం ప్రాజెక్టు.. కట్టుకున్నది జగన్ కోసమే! కట్టింది జనం ధనంతోనే..!
ఎన్డీఏ కూటమిలో మంత్రివర్గంలో స్థానంపై భీమిలీ తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలోకి ఎవరెవర్ని తీసుకోవాలో టీడీపీ అధినేత చంద్రబాబే నిర్ణయిస్తారని అన్నారు.
విశాఖ: ఈనెల13 న జరిగిన పోలింగ్ సరళి చూస్తే... ఓటర్లు కూటమికే పట్టం కట్టారని.. సంక్రాంతి పండగను తలపించే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి ఓట్లు వేసారని మాజీ మంత్రి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు.
Andhrapradesh: భీమిలి నియోజకవర్గం మేనిఫెస్టోను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఎట్టి పరిస్థితిలో మళ్లీ అధికారంలోకి రాకూడదని కూటమి పనిచేస్తుందన్నారు. వైసీపీ ఇంటికి పంపించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు. జూన్ 4న జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారని అన్నారు.
విశాఖ జిల్లా: భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ మీద షాక్లు తగులుతున్నాయి. నిన్న జగన్ భీమిలి నియోజకవర్గంలోకి ప్రవేశించే సమయంలో కుసులువాడ గ్రామ పంచాయతీ మొత్తం టీడీపీలోకి చేరిపోయింది. ఇవాళ అదే నియోజకవర్గంపై సీఎం జగన్ స్వయంగా సమీక్ష చేస్తున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) పార్టీ లాగానే., ఏపీలో కూడా వైఎస్సార్సీపీ (YSRCP) కనుమరుగు కావడం ఖాయమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలోని మధురవాడలో తన నూతన కార్యాలయాన్ని శుక్రవారం నాడు ప్రారంభించారు.