Home » Gannavaram
గన్నవరం నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ కోసం ఓ కమిటీని కూటమి ప్రభుత్వం నియమించింది. బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం మండలాల్లోని చెరువులు, వాగులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై పూర్తిస్ధాయి విచారణను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం.
రన్ వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ఓ పక్షి బలంగా విమానాన్ని ఢీ కొట్టింది. పక్షి ఢీకొనటంతో పైలట్ సడన్ ఎయిర్ బ్రేక్ వేశాడు. ఆ వెంటనే విమానాన్ని వెనక్కు తీసుకువచ్చాడు.
బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సిన ఇండిగో విమానం వాతావరణం అనుకూలించక విజయవాడ(గన్నవరం) విమానాశ్రయంలో దిగింది.
CM Chandrababu Helicopter: వాతావరణం సరిగ్గా అనుకూలించకపోవడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ను గన్నవరంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో సీఎం ప్రత్యేక విమానంలో రాజమండ్రికి బయలుదేరి వెళ్లారు.
Vallabhaneni Vamsi: నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. అదనంగా, అక్రమ మైనింగ్ కేసులో ఆయనపై రూ. 192 కోట్ల అక్రమ లాభాల ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మరో కేసు నమోదు అయింది.
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీకి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు స్వాగతం పలికారు.
Gannavaram Airport: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాక సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్టులో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇంతలోనే విమానాశ్రయంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.
ప్రధాని మోదీ పర్యటనకు గన్నవరం విమానాశ్రయంలో కలెక్టర్ డీకే బాలాజీ నేతృత్వంలో పకడ్బందీ ఏర్పాట్లు. అధికారులు సమన్వయం తీసుకొని అన్ని ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేయాలని ఆదేశించారు
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కృష్ణా జిల్లా, గన్నవరం రాజీవ్ కాలనీలో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ నాయకులు కబ్జా చేశారు. దీనిని ఆ కాలనీకి చెందిన యువకులు అడ్డుకున్నారు.
AP Highcourt: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది.