Home » Facebook
ఆ వ్యక్తికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగిన రెండు నెలల తర్వాత అతడి భార్య అనారోగ్యానికి గురైంది. తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్కు తీసుకెళ్లాడు. స్కానింగ్ తీసిన డాక్టర్లు ఆమె గర్భాశయంలో సమస్య ఉందని తెల్చారు. ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తేల్చి చెప్పారు.
సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం. సోషల్ మీడియా అలాంటి అద్భుతాలను, వింతలను అందరికీ చేరవేస్తోంది. తాజాగా హంగేరీలోని ఓ రోడ్డు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ రోడ్డుమీద సరైన స్పీడులో వెళితే సంగీతం వస్తోంది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి ఎంతోగానో వెంపర్లాడుతున్నారు. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. వెరైటీగా ఆలోచించి చుట్టుపక్కల వారికి షాకిస్తున్నారు.
ప్రస్తుతం ఓ వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఓ ఉద్యోగి సెలవు కావాలంటూ చేసిన మెసేజ్ ఆ బాస్ కొంప ముంచింది. మహిళా ఉద్యోగి పంపించిన మెసేజ్ చదివిన భార్యకు ఎలా సర్ది చెప్పాలో తెలియక ఆ బాస్ తల పట్టుకున్నాడు. ఆ ఫన్నీ వాట్సాప్ మెసేజ్ల స్క్రీన్ షాట్ చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది.
జీవితంలో కోరుకున్నది సాధించాలనే తపన, పట్టుదల ఉంటే విజయం సాధించడం అంత పెద్ద కష్టమేమీ కాదు. ఏ పని చేస్తున్నా లక్ష్యంపై ధ్యాస ఉంటే దానిని చేరుకోవడం అసాధ్యమేమీ కాదు. ఈ మాటలను మీరు నమ్మడం లేదా? అయితే తమిళనాడుకు చెందిన జొమాటో డెలివరీ బాయ్ విఘ్నేష్ కథ తెలుసుకోవాల్సిందే.
ఇటీవల ఓ యువకుడు షేర్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఆ ఫొటోపై నెటిజన్లు తమదైన వాదనలను వినిపిస్తున్నారు. @iffiViews అనే ట్విటర్ హ్యాండిల్లో ఓ యువకుడు తన హాస్టల్ రూమ్కు సంబంధించిన ఫొటోను షేర్ చేశాడు.
తన మరిదితో ప్రేమలో పడిన ఓ మహిళ తన భర్త సమక్షంలోనే అతడిని ప్రేమ వివాహం చేసుకుంది. భర్తే దగ్గరుండి మరీ తన భార్యకు, ఆమె మరిదికి వివాహం జరిపించాడు. ఒడిశాలోని సోన్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహ తెలియని అమాయక చిన్నారులను అనుక్షణం కనిపెట్టుకుంటూ ఉండాలి. ఏది మంచో, ఏది చెడో తెలియని చిన్నారుల విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే అలాంటి ప్రమాదం కూడా జరుగుతుందా అనిపిస్తుంది
చాక్లెట్లు దొంగతనం చేసిన ఓ వ్యక్తికి బ్రిటన్ కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది. అదేంటి.. చాక్లెట్లు దొంగిలించినందుకు అంత శిక్ష పడిందా అని ఆశ్చర్యపోతున్నారా? అతను దొంగిలించిన చాక్లెట్లు ఒకటి, రెండు కాదు.. ఏకంగా 2 లక్షల చాక్లెట్లను దొంగిలించాడు. ఆ చాక్లెట్ల ఖరీదు అక్షరాలా రూ.42 లక్షలు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు ఆసక్తికరంగా అనిపించిన వాటిని, నవ్వు తెప్పించిన వాటిని ట్విటర్లో పోస్ట్ చేసి అందరితో పంచుకుంటుంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఆసక్తికర వీడియో చాలా మందిని ఆకట్టుకుంది.