Home » EVM Machine
న్యూఢిల్లీ: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాల్సిందేనని.. పోలీసులకు ఆదేశించాలంటూ బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని, హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలైనా.. తొలి రౌండ్ ఫలితం కోసం కొంత ఎదురుచూపులు తప్పవు. ఈవీఎంలు తెరవడం.. వాటిని టేబుళ్లపై చేర్చడం.. లెక్కించడం.. సరిపోల్చుకోవడం.. వాటిని రిటర్నింగ్ అధికారి నిర్ధారించుకొని ఫలితాన్ని ప్రకటించడం.. వీటన్నింటికీ గంటన్నర పట్టే అవకాశం ఉంది.
పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మరో మూడు కేసుల్లో షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరుచేసింది.
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంగారెడ్డిలో పరారై పల్నాడు జిల్లా నరసారావుపేటలో ప్రత్యక్షమయ్యారు..
ఈవీఎం మేషిన్లకు ఉన్న ట్యాగ్పై బీజేపీ ప్రతినిధి సంతకం మాత్రమే ఉండడంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం శనివారం స్పందించింది.
ఎన్నికల విధుల్లో ఉండగా ఆ అధికారి వ్యవహరించిన తీరు వివాదస్పదంగా మారింది. కీలక బాధ్యతల్లో ఉన్న పల్నాడు జిల్లా పంచాయతీ అధికారి విజయ భాస్కరెడ్డి పోలింగ్ రోజు ఉద్దేశపూర్వకంగానే కొన్ని గంటల పాటు కంట్రోల్ రూమ్ను వదిలేసి వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. తాను ఓటు వేసేందుకు వెళ్లినట్టు అయన చెబుతున్నారు.
పోలింగ్ రోజు జరిగిన దాడులు, అనంతర పరిణామాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈవీఎం, వీవీప్యాట్ ధ్వంసం చేయడం వైసీపీ అరాచకానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కౌంటింగ్ వరకూ పిన్నెల్లిని అరెస్టు చేయొద్దు అంటే అర్థం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. ఇంత దరిద్రపుగొట్టు ఎలక్షన్స్ దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదని అసహనం వ్యక్తం చేశారు.
ఈవీఎం బద్దలుకొట్టిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి దాగుడు మూతలు కొనసాగుతున్నాయి. ‘పరారీ’లో ఉన్న ఆయన ముందస్తు బెయిలు కోసం గురువారం హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం కోర్టు ఆయనకు భారీ ఊరట కలిగించింది. ఫలితాలు వెలువడి, కోడ్ ముగిసేదాకా...
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. పోలింగ్ బుత్లో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో.. ప్రస్తుతం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఇప్పటికే సీఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పోలింగ్ రోజు, ఆ తర్వాత మాచర్లలో అరాచకం సృష్టించిన వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోయారా...