Home » Enforcement Directorate
గొర్రెల స్కీంకు సంబంధించిన పూర్తి వివరాలను ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. వాటి ఆధారంగా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రావును విచారిస్తున్నారు. గొర్రెల స్కాంలో దళారులు మొయినుద్దీన్, ఈక్రముద్దీన్పై అధికారులు అరా తీస్తున్నారు.
సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఎన్ఫోర్స్నమెంట్ డైరక్టరేట్ అధికారులు రెండోసారి సోదాలు చేస్తున్నారు. సురానా ఇండస్ట్రీస్ లిమిటెడ్, M/s సురానా కార్పొరేషన్ లిమిటెడ్, M/s సురానా పవర్ లిమిటెడ్, కంపెనీల ఇద్దరు ప్రమోటర్లు, ఇతర అనుబంధ సంస్థలపై పీఎంఎల్ఏ (PMLA) కింద ఈడీ కేసు నమోదు చేసింది.
గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలను మనీ లాండరింగ్ కేసుగా ఈడీ విచారణ చేపట్టింది. బుధవారం పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బుధవారం ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే గొర్రెల స్కీంకు సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ అధికారులు తెప్పించుకున్నారు.
ఈడీ విచారణకు హాజరు కావాలంటూ రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేయగా.. గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో మంగళవారం నాడు రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ జారీ చేసిన నోటీసులపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని కూలదొచ్చే కుట్రలో భాగంగా ఈ చర్యలు తీసుకుందని ఆరోపించారు
స్థిరాస్తుల జప్తునకు సంబంధించి మూడు ప్రాంతాల్లో నోటీసులు అతికించినట్టు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని ఐటీవోలో ఉన్న హెరాల్డ్ హౌస్, ముంబైలోని బాంద్రా ఏరియాలోని ప్రాంగణంలో, లక్నోలోని బిషేశ్వర్ నాథ్ రోడ్డులో ఉన్న ఏజేఎల్ బిల్డింగ్ వద్ద ఈ నోటీసులు అతికించినట్టు పేర్కొంది.
ఆస్తులు మొత్తాన్ని గ్యాంగ్స్టర్ నయీం కుటుంబ సభ్యులు హసీనా బేగం, తహీరా బేగం, సలీమా బేగం, అబ్దుల్ సలీం, అహేలాబేగం, సయ్యద్ నిలోఫర్ , ఫిర్దోస్ అంజూమ్, మహమ్మద్ ఆరిఫ్ ,హసీనా కౌసర్ పేర్ల మీద రిజిస్టర్ చేసినట్లు ఈడి గుర్తించింది. వీరి పేర్లను ఈసీఐఆర్ (ECIR)లో నమోదు చేసింది.
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. బెట్టింగ్ యాప్స్ సమస్యపై ఈడీ ఆరా తీసింది.
డీెఎంకే ఎంపీ కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విభాగం కేంద్ర ప్రభుత్వ శాఖగా పనిచేస్తోందంటూ ఆమె విమర్శించారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారితీశాయి.
ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో 15 ప్రాంగణాల్లో ఈడీ సోమవారంనాడు సోదాలు జరిపింది. వాటిలో భిలాయి ప్రాంతంలో ఉన్న భూపేశ్ భగేల్ కుమారుడు చైతన్య భగేల్ నివాసం కూడా ఉంది.