Home » Employees
ప్రభుత్వ శాఖల్లో దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తోన్న సెక్షన్ అధికారులను ఇతర శాఖలకు బదిలీ చేస్తూ జీఏడీ సర్వీసెస్ కార్యదర్శి పోల భాస్కర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి, పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడంతో సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డి ని అర్థరాత్రి అరెస్టు చేశారు. ఉద్యోగులను ప్రభావితం చేయడానికి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్లో ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు చేశారు.
ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. బ్యాంకులతో అనుసంధానం కావడం ద్వారా వారికి వైద్య బీమా సదుపాయం కల్పించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పిస్తోంది.
రాజ్యాంగ దినోత్సవ సభలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల గురించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ‘ఉద్యోగులూ.. హార్డ్ వర్క్ వద్దు, స్మార్ట్ వర్క్ చేయండి.
అనవసర ఖర్చులు తగ్గించేందుకు బడ్జెట్లో కోతలు విధించడమే ప్రథమ లక్ష్యమని ప్రకటించిన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చేందుకు కసరత్తు మొదలైంది.
విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారుల మీద జరిగిన దాడికి నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు ఉద్యోగుల జేఏసీ పిలుపునిచ్చింది.
చిన్న తప్పులకే తమను ఉద్యోగం నుంచి తొలగించారని, సీఎం రేవంత్ కల్పించుకుని తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులు, కార్మికులు విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం త్వరలో వేతన జీవులకు శుభవార్త చెప్పనుందా? ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్వోలో) పరిమితిని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచనుందా? ఈ ప్రశ్నలకు విశ్వసనీయవర్గాలు ఔననే చెబుతున్నట్లు జాతీయ వార్తాసంస్థలు కథనాలను ప్రచురించాయి.
పని చేసే చోట సహోద్యోగి వేధింపులు, యాజమాన్యం దురుసు మాటలకు మనస్తాపంతో ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది.
పెండింగ్లో ఉన్న బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. తహసీల్దార్లకు అద్దె వాహనాల బకాయిలు రెండేళ్లుగా చెల్లించడంలేదని, ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్, లోక్సభ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉద్యోగుల పారితోషకం, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు, ఉద్యోగుల సరెండర్ లీవ్స్ బిల్లులు చెల్లించడంలేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.