Home » Elections
రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.
తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాల ప్రకారం 6 స్థానాల్లో 4 స్థానాలను డీఎంకే సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉండగా, తక్కిన రెండు సీట్లను బీజేపీ, మిత్రపక్షాల మద్దతుతో అన్నాడీఎంకే గెలుచుకునే వీలుంది.
ఏం భయంలేవు.. మళ్లీ అధికారం మనదే.. అంటూ డీఎంకే పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆ పార్టీ కార్యకర్తలకు లేఖ రాశారు. జూన్ ఒకటో తేదీ ఉదయం 9 గంటలకు మదురైలో పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతుందని తెలిపారు.
రాజకీయాల్లో ఆ హీరో ఓ బచ్చా.. ఎవరెన్ని చెప్పినా.. మళ్లీ అధికారం డీఎంకే పార్టీదేనని రాష్ట్రమంత్రి దురైమురుగన్ వ్యాఖ్యానించారు. ఆ కామెంట్స్ ఇప్పుడు తమిళనాట సంచలనానికి దారితీశాయి. మరికొద్ది రోజుల్లో తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది.
మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఓటమి తథ్యం అని మాజీమంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్బీ ఉదయ్కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యధిక స్థానాల్లో అన్నాడీఎంకే పార్టీ గెలవడం ఖాయమని ఆయన అన్నారు.
మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. సినీ నటుడు విజయ్ ఏర్పాటుచేసిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులంతా ఒకే గుర్తు (కామన్ ఎలక్షన్ సింబల్) దక్కించుకునేలా ఆ పార్టీ అధినేత విజయ్ దృష్టిసారించారు.
నో డౌట్.. రాసిపెట్టుకోండి.. మరో పదేళ్లు మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కర్లేదు.. అంటూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. డీఎంకే ద్రావిడ తరహా పాలనపై ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలు తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని స్టాలిన్ అన్నారు.
దమ్ముంటే.. ‘స్థానిక’ ఎన్నికలు జరపండి.. అంటూ మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో విఫలమైందని ఆమె విమర్శించారు.
రాసిపెట్టుకోండి.. రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. హైడ్రా పేరుతో ఇళ్లను కూలగొట్టి మహాపాపం మూటగట్టుకుందని కేటీఆర్ అన్నారు.
వైసీపీకి అనుకూలంగా ప్రవర్తించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వెంకట్రామిరెడ్డిపై అభియోగాలు నిర్ధారణ కాగా, ప్రభుత్వంలో ఉన్న అనుచరుల వల్ల చర్యలు ఆలస్యం అయ్యాయి. చార్జిషీట్లు నమోదైనా జీఏడీ గప్చుప్ వ్యవహారం అధికారులు విమర్శకు లోనవుతోంది