• Home » Election Commission

Election Commission

Jammu Kashmir: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు..!

Jammu Kashmir: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు..!

సార్వత్రిక ఎన్నికల వేళ జమ్ముకశ్మీర్‌లో ఓటర్లు.. పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. దీంతో రాష్ట్రంలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఆ క్రమంలో జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో నగారా మోగే అవకాశముంది.

EC : 5 దశల్లో.. 50.72 కోట్ల మంది

EC : 5 దశల్లో.. 50.72 కోట్ల మంది

ఎన్నికల్లో ఒక్కో దశలో ఎంతమంది ఓటర్లు ఓటు వేశారన్న వివరాలను ఎన్నికల సంఘం (ఈసీ) శనివారం వెల్లడించింది. ఐదు దశల పోలింగ్‌లో మొత్తం 50.72 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పేర్కొంది. ఒక్కో దశ వారీగా కూడా వివరాలను ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

TG Politics: కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం

TG Politics: కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఓట్ల శాతం వెంటనే చెప్పాలని..  ఈసీని ఆదేశించలేం

ఓట్ల శాతం వెంటనే చెప్పాలని.. ఈసీని ఆదేశించలేం

ఓట్ల శాతంపై తుది డేటాను వెంటనే వెల్లడించాల్సిందిగా ఎన్నికల కమిషన్‌(ఈసీ)ను ఆదేశించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మరో వారం రోజుల్లో ఎన్నికలు ముగుస్తాయని, ఈ మధ్యలో జోక్యం చేసుకోలేమని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌చంద్రతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ శుక్రవారం స్పష్టంచేసింది.

AP Election 2024: ఎన్నికల కౌంటింగ్‌కు సీఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలి: దేవినేని ఉమ

AP Election 2024: ఎన్నికల కౌంటింగ్‌కు సీఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలి: దేవినేని ఉమ

ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి (Electoral Commission) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలు ఫిర్యాదు చేశారు.ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాను టీడీపీ నేతలు వర్ల రామయ్య , దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి శుక్రవారం కలిశారు. ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని అందజేశారు.

AP Elections: ఏపీలో భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..?

AP Elections: ఏపీలో భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..?

ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. పలు చోట్ల వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. పోలింగ్ రోజున రాత్రి వరకు పోలింగ్ జరిగింది. దీంతోపాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా భారీగా పెరిగాయి.

Varla Ramaiah: ఆ ఈవీఎంలో టీడీపీకి 22 ఓట్లు.. వైసీపీకి 6

Varla Ramaiah: ఆ ఈవీఎంలో టీడీపీకి 22 ఓట్లు.. వైసీపీకి 6

మాచర్ల నియోజకవర్గంలో మార్పు మొదలైందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ప్రజల్లో వస్తోన్న మార్పును చూసి పోలింగ్ జరిగే రోజున ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎం పగులగొట్టారని ఆరోపించారు. పిన్నెల్లి అహంకారాన్ని మాచర్ల ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణిచివేశారని వివరించారు. నియోజకవర్గంలో పిన్నెల్లిని ప్రజలు తిరస్కరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Election Commission: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్

Election Commission: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల(telangana formation day 2024) నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. జూన్ 2న జరిపే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు ఎన్నికల సంఘం(Election Commission) అనుమతి ఇచ్చింది.

Supreme Court: ఎన్నికల మధ్యలో ఈసీని అలా ఆదేశించలేం: సుప్రీంకోర్టు

Supreme Court: ఎన్నికల మధ్యలో ఈసీని అలా ఆదేశించలేం: సుప్రీంకోర్టు

లోక్‌సభ ఎన్నికలు మధ్యలో ఉన్నందున ఓటింగ్‌కు సంబంధించిన తుది సమాచారాన్ని పోలింగ్ కేంద్రాల వారిగా వెబ్‌సైట్‌లో ఉంచేలా ఎన్నికల సంఘాన్ని తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు శుక్రవారంనాడు స్పష్టం చేసింది. ఇందుకు ఈసీ భారీ స్థాయిలో మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.

Lok Sabha Elections: ఢిల్లీలో లక్షకు పైగా పోలింగ్ సిబ్బంది.. ఓటర్లకు స్విగ్గీ, జొమాటో కూపన్లు

Lok Sabha Elections: ఢిల్లీలో లక్షకు పైగా పోలింగ్ సిబ్బంది.. ఓటర్లకు స్విగ్గీ, జొమాటో కూపన్లు

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల కమిషన్ విస్తృత ఏర్పాట్లు చేసింది. లక్షకు మందికి పైగా పోలింగ్ సిబ్బందిని మోహరించినట్టు ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి పి.కృష్ణమూర్తి తెలిపారు. ఉత్తర భారతదేశంలో వడగాలులు వీస్తుండటంతో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పలు చర్యలు చేపట్టినట్టు చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి