Home » Election Commission of India
దాదాపు 150 మంది జిల్లా కలెక్టర్లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్లు చేసి బెదిరించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. దీనిపై ఈసీ స్పందించింది. ఈ మేరకు ఏ ఒక్క కలెక్టరు నుంచి తమకు ఫిర్యాదులు అందలేదని తెలిపింది.
అరుణాచల్ ప్రదేశ్లో కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ ఇక్కడ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మరోవైపు సిక్కింలో.. సిక్కిం క్రాంతి మోర్చా(ఎ్సకేఎం) రెండోసారి అధికారాన్ని చేపట్టనుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏప్రిల్ 19 ఎన్నికలు జరగ్గా.. లోక్సభతోపాటు ఫలితాలను ఈ నెల 4న ప్రకటించాల్సి ఉంది.
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల వేడిమిని తట్టుకోలేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల విధుల్లో పాల్గొన్న 33మంది సిబ్బంది శనివారం ఎండల కారణంగా మృతిచెందారు. వీరిలో హోంగార్డులు, శానిటేషన్ సిబ్బంది ఉన్నారు.
లోక్ సభ ఎన్నికల(Lok Sabha Polls 2024) సందర్భంగా జూన్ 4న జరిగే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల సంఘం(Election Commission of India) మార్గదర్శకాలు విడుదల చేసింది. లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు,వివిధ రాష్టా్ల అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం శనివారం తెలిపింది.
లోక్సభ 2024 ఎన్నికల (Lok Sabha Election 2024) ఏడో దశ పోలింగ్ శనివారం ముగిసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న జరగనుంది. వీటి ఫలితాల కోసం పౌరులతోపాటు రాజకీయ పార్టీల నేతలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపునకు(counting) ఇప్పుడు సన్నాహాలు ఊపందుకున్నాయి.
ఓట్ల లెక్కింపునకు ముందు, లెక్కింపు రోజున, ఆ తర్వాత అత్యంత శ్రద్ధతో శాంతిభద్రతలను పరిరక్షించడం అవశ్యం అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు. శనివారం ఈ మేరకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలకు ఆయన లేఖ రాశారు.
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీకి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్కు సంబంధించి ఫారమ్-13ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
Lok Sabha Election 2024 Exit Poll Results Live Updates in Telugu: దేశాన్ని ఏలేది ఎవరు.. ప్రజలు పట్టం కట్టేదెవరికి.. పదేళ్లు ఏకఛత్రాదిపత్యంగా దేశాన్ని పాలించిన నరేంద్ర మోదీ(PM Narendra Modi) మరో అవకాశం ఇస్తారా? లేక మార్పు తప్పదు అంటూ ఇండియా కూటమికి(INDIA Alliance) జై కొడతారా? లేక ఎవరికీ మెజార్టీ రాకుండా చేస్తారా? ఇప్పుడిదే అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ దాఖలు చేసిన వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇ
కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.