Home » Election Commission of India
రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులు, ఉద్యోగులకు ఒక నెల జీతాన్ని గౌరవ వేతనంగా ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వారికి శిక్ష తప్పదని, మాచర్ల మాజీ శాసన సభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించింది.
రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం కోసం ఎన్నికల కమిషన్(ఈసీ)కు భారీ స్థాయిలో రూ.622 కోట్లు ఖర్చు కావడంపై ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎ్ఫజీజీ) అనుమానం వ్యక్తం చేసింది.
దేశవ్యాప్తంగా 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని 92 పోలింగ్ కేంద్రాలు, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 26 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది
దేశంలో ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సోమవారం న్యూఢిల్లీలో విడుదల చేసింది. జూలై 10వ తేదీన ఈ ఉప ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయింది. 18వ సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్ బ్యాలట్ ఓట్లు మినహా ఈవీఎంల్లో 65.79 శాతం మేర పోలింగ్ జరిగినట్లు గురువారం సీఈసీ రాజీవ్ కుమార్ వివరించారు.
Prime Minister Of India: దేశ భవిష్యత్ను నిర్దేశించే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలూ వచ్చేశాయి.. కానీ, ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ఓటర్లు. ఎవరికీ పూర్తిస్థాయి మెజార్టీ ఇవ్వకపోవడంతో.. మళ్లీ సంకీర్ణ సర్కార్ అనివార్యమైంది. దీంతో అసలు చర్చ ఇప్పుడే ప్రారంభమైంది. ఇంతకాలం మోదీ 3.0 సర్కార్ వస్తుందని అంతా అనుకున్నా.. సీన్ రివర్స్ అయ్యింది. ఎగ్జిట్ పోల్స్ ఎగబడి ఎగబడి.. మోదీ నామం జపించినా..
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఒకవేళ ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాకుండా ‘హంగ్’ వస్తే అలాంటి సందర్భాల్లో ప్రజాస్వామ్య సంప్రదాయాలను పాటించాలని కోరుతూ ఏడుగురు మాజీ న్యాయమూర్తులు రాష్ట్రపతికి లేఖ రాశారు
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా రాజ్యాంగాన్ని పాటించాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం అధికార యంత్రాంగానికి బహిరంగ లేఖ రాశారు. ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా దేశానికి సేవ చేయాలని, ఎవరిపట్లా దుర్బుద్ధితో వ్యవహరించకూడదని కోరారు
కేంద్ర మంత్రి అమిత్ షాపై తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించడానికి వారం రోజుల సమయం కావాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ చేసిన అభ్యర్థనను ఎన్నికల సంఘం తిరస్కరించింది. చివరి దశ ఎన్నికలు ముగిశాక..