Home » Election Campaign
ఎన్నికల సమయం. ఓటు హక్కు ఉన్నవాళ్లంతా ఓట్లు వేసేందుకు పోలింగ్ రోజు బూత్లకు క్యూకడుతుంటారు. ఓట్ల పండుగ అంటే చెప్పేదేముంది.. అంతా హడావుడి.. రకరకాల జనం ఓటు కోసం వస్తుంటారు. ఓటు వేయడానికి ఎన్నికల సంఘం పలు నిబంధనలు రూపొందించింది. ఓటు వేసే సమయంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాల్సిందే. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి.
Andhrapradesh: పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పాల్గొన్నారు. కొండలు, గుట్టలు ఎక్కి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. సుజనా ముందు ప్రజలు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. మంచినీరు, డ్రైనేజి, రోడ్ల దుస్థితిని సుజనాకు స్థానికులు వివరించారు.
ఏపీలో పోలింగ్ టైమ్ దగ్గరపడింది. పొరుగూరు అంతా సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఊరు నుంచి వచ్చిన ఓటర్ల దగ్గరకు వెళ్లి పార్టీ శ్రేణులు పలకరిస్తున్నారు. ప్రయాణం ఎలా జరిగింది. అంతా కులాశానేనా.. పని ఎలా నడుస్తుంది. ఆరోగ్యం బాగుందా అంతా అప్యాయంగా పలకరిస్తూ.. చివరిలో మన గుర్తు మర్చిపోకు.. మన పార్టీకే ఓటు వేయాలంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు .
కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ సిటీలో పర్యటనకు అధికారులు అడ్డంకులు ఏర్పరిచారు. ప్రచారం చివరి రోజున కాకినాడలో పవన్ రోడ్ షో, సభకు టీడీపీ, జనసేన పార్టీలు దరఖాస్తు చేశాయి. అయితే అదే రోజు కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి బైక్ ర్యాలీ ఉందని పోలీసులు పేర్కొంటూ పవన్ పర్యటనకు అనుమతి నిరాకరించారు.
రాష్ట్రంలో ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన రెక్కలను ఓటుతో విరగ్గొట్టాలని సినీనటుడు నారారోహిత పేర్కొన్నారు. ఆయన గురువారం గుడిబండలో రోడ్షో నిర్వహించా రు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్య దర్శి శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నారారోహిత మాట్లాడుతూ నారాచంద్రబాబు నాయుడు సీఎం అయితేనే రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ది చెందుతుందని అన్నారు.
ఐదేళ్ల జగన్మోహనరెడ్డి నియంత పాలన ఇక మూడురోజుల్లో అంతం కాబోతోందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్య ర్థి సవిత, ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారఽథి పే ర్కొన్నారు. గోరంట్ల పట్టణంలో గురు వారం నిర్వహించిన రోడ్షోలో వారితోపాటు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, బీకేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెం డాలు పట్టుకుని, ద్విచక్రవాహనాల్లో హోరెత్తిం చారు. కదిరి రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద నుంచి ప్రధాన రహదారిపై రోడ్షో నిర్వహించగా గజ మాల లు వేయడానికి కూటమి నాయకులు పోటీపడ్డారు.
వైసీపీ మరోసారి అధికారం లోకి వచ్చిందంటే ఆస్తులు వదులుకోవాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. గురువారం హిందూపురం మండలంలోని బేవనహళ్లిలో, పట్టణ పరిధిలోని కొన్ని వార్డుల్లో ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఐదే ళ్లలో వైసీపీ నాయకులు హిందూపురం నియోజకవర్గం లో మాన్యం భూములను కబ్జాచేశారని, ప్రభుత్వ భూ మి ఎక్కడ కనిపించినా అమ్మేశారన్నారు. మరోసారి వైసీ పీ వస్తే మనందరి ఆస్తులు వదులుకుని ఊళ్లు విడచాల్సిందేనన్నారు.
న్నికల్లో కూటమి అభ్యర్థి గెలుపు కోసం సహకరించాలని పలువురు నాయకులను టీడీపీనేత జేసీ పవనరెడ్డి కోరారు. గురువారం మండలంలోని రాయలచెరువులో పలువురు సీనియర్ నాయకులు మోటుపల్లి జయరాములు, సీతారాములు, రంజిత తదితరులను ఆయన కలిశారు.
పార్టీల తలరాతలు మార్చే శక్తి మహిళలకు ఉందని, రానున్న ఎన్నికల్లో వైసీపీకి మహిళలే తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. గురువారం సాయంత్రం ఆయన పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. పాతగుంతకల్లు నుంచి వ్యాపార సముదాయాల వారికి, పట్టణ ప్రజలకు అభివాదాలు తెలుపుతూ ప్రధాన రహదారిలో ప్రచారం చేశారు.
తనను గెలిపిస్తే ప్రజలకు పాలేరులా పనిచేస్తానని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. గురువారం మండలంలోని ఉప్పరహాళ్, శ్రీధరఘట్ట, బండూరు, దేవగిరి, బొమ్మనహాళ్లో రోడ్షో నిర్వహించారు. ఆయా గ్రామాలలో కాలవ శ్రీనివాసులుకు జనం నీరాజనం పలికారు. ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలతో పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు రోడ్షోలో పాల్గొన్నారు.