Home » Election Campaign
ఐదేళ్ల జగన్మోహనరెడ్డి నియంత పాలన ఇక మూడురోజుల్లో అంతం కాబోతోందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్య ర్థి సవిత, ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారఽథి పే ర్కొన్నారు. గోరంట్ల పట్టణంలో గురు వారం నిర్వహించిన రోడ్షోలో వారితోపాటు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, బీకేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెం డాలు పట్టుకుని, ద్విచక్రవాహనాల్లో హోరెత్తిం చారు. కదిరి రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద నుంచి ప్రధాన రహదారిపై రోడ్షో నిర్వహించగా గజ మాల లు వేయడానికి కూటమి నాయకులు పోటీపడ్డారు.
వైసీపీ మరోసారి అధికారం లోకి వచ్చిందంటే ఆస్తులు వదులుకోవాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. గురువారం హిందూపురం మండలంలోని బేవనహళ్లిలో, పట్టణ పరిధిలోని కొన్ని వార్డుల్లో ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఐదే ళ్లలో వైసీపీ నాయకులు హిందూపురం నియోజకవర్గం లో మాన్యం భూములను కబ్జాచేశారని, ప్రభుత్వ భూ మి ఎక్కడ కనిపించినా అమ్మేశారన్నారు. మరోసారి వైసీ పీ వస్తే మనందరి ఆస్తులు వదులుకుని ఊళ్లు విడచాల్సిందేనన్నారు.
న్నికల్లో కూటమి అభ్యర్థి గెలుపు కోసం సహకరించాలని పలువురు నాయకులను టీడీపీనేత జేసీ పవనరెడ్డి కోరారు. గురువారం మండలంలోని రాయలచెరువులో పలువురు సీనియర్ నాయకులు మోటుపల్లి జయరాములు, సీతారాములు, రంజిత తదితరులను ఆయన కలిశారు.
పార్టీల తలరాతలు మార్చే శక్తి మహిళలకు ఉందని, రానున్న ఎన్నికల్లో వైసీపీకి మహిళలే తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. గురువారం సాయంత్రం ఆయన పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. పాతగుంతకల్లు నుంచి వ్యాపార సముదాయాల వారికి, పట్టణ ప్రజలకు అభివాదాలు తెలుపుతూ ప్రధాన రహదారిలో ప్రచారం చేశారు.
తనను గెలిపిస్తే ప్రజలకు పాలేరులా పనిచేస్తానని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. గురువారం మండలంలోని ఉప్పరహాళ్, శ్రీధరఘట్ట, బండూరు, దేవగిరి, బొమ్మనహాళ్లో రోడ్షో నిర్వహించారు. ఆయా గ్రామాలలో కాలవ శ్రీనివాసులుకు జనం నీరాజనం పలికారు. ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలతో పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు రోడ్షోలో పాల్గొన్నారు.
సీఉం జగన్మోహన రెడ్డి నయవంచకుడని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మండిపడ్డారు. గురువారం ప్రజావేదిక వద్ద విప్ కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, మున్సిపల్ మాజీ ఛైర్మన వైపి రమేష్, మార్కెట్ మాజీ యార్డు చైర్మన చౌళం మల్లికార్జున, మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు, జనసేన నాయకులు బాల్యం రాజే్షతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. సూర్యాపేటలో గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
Andhrapradesh: సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. సంక్షేమ పథకాలకు నిధులు నిలిపివేతపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్లు దాఖలు చేసింది. ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణ జరుగగా.. ఎన్నికల కమిషన్, ప్రభుత్వం తరపున వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది.
గడచిన ఐదేళ్లుగా అదానీ, అంబానీలపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్.. ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే ఎందుకు మౌనం దాల్చిందో స్పష్టం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ డిమాండ్
పెనుకొండ నియోజకవర్గ ప్రజలారా ఇసుక దొంగలు వస్తున్నారు... తస్మాత జాగ్రత్త... అని ్డ్డ్డటీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత హెచ్చరించారు. ఆమె బుధవారం మండల పరిధిలోని వైటీరెడ్డిపల్లి, రంగాపు రం, దొడగట్ట, డీఆర్ కొట్టాల, రెడ్డిపల్లి, గోనిమేకలపల్లి, పెద్దగువ్వలపల్లి, ఆర్ కొట్టాల ఆర్ మరువపల్లి, రొద్దం, తిమ్మాపురం, బూదిపల్లి, శేషాపురం, కలిపి, కె మరు వపల్లిల్లో బీకే పార్థసారథితో కలిసి రోడ్షో నిర్వహిం చారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ... కళ్యాణ దుర్గం నుంచి వలస పక్షి ఉశశ్రీ వచ్చిందని, అక్కడి ఇసుకంతా బెంగళూరుకు తరలించి సొమ్ము చేసుకుం దని విమర్శించారు.