Home » ED
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఛీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా (Sanjay Kumar Mishra) పదవికాలాన్ని 15 సెప్టెంబర్ 2023 వరకు పొడగింపునకు సుప్రీంకోర్ట్ (Supreme Court) అనుమతిచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తికి అత్యున్నత న్యాయస్థానం అంగీకారం తెలిపింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే కేంద్రం విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నట్టు కోర్ట్ తెలిపింది.
కామినేని గ్రూప్పై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కామినేని గ్రూప్ చైర్మన్, ఎండీ నివాసాలపై సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణలో మొత్తంగా 15 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్లో సైతం సోదాలు జరుగుతున్నాయి. అలాగే మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కళాశాలలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. షామీర్పేటలోని మెడిసిటీ కళాశాలలో ఏరియా అధికారులు సోదాలు చేస్తున్నారు.
హైదరాబాద్లో మరోసారి ఈడీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ఇటీవలే పలువురు బీఆర్ఎస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులను ఈడీ నిర్వహించిన విషయం తెలిసిందే. వారిని విచారణకు సైతం రమ్మంటూ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం బషీర్ బాగ్లోని ఈడీ కార్యాలయం నుంచి ఈడీ అధికారులు 11 బృందాలుగా వెళ్లారు. భారీగా సీఆర్పీఎఫ్ బలగాలతో ఈడీ బృందాలు బయలుదేరాయి.
హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. టి.వెంకట్రామి రెడ్డి, పీకే అయ్యర్ను ఈడీ అరెస్ట్ చేసింది. డీసీ ఆడిటర్ మనీ ఊమెన్ను ఈడీ అరెస్ట్ చేసింది. కెనరా, ఐడీబీఐ బ్యాంకులను మోసం చేసిన కేసులో అరెస్ట్ చేయడం గమనార్హం.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడు మాగుంట రాఘవ మధ్యంతర బెయిల్ రద్దు అయ్యింది. రాఘవ మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జూన్ 12న సరెండర్ కావాలని రాఘవను సుప్రీం ఆదేశించింది. మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ బెయిల్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాఘువ బెయిల్పై రేపు (శుక్రవారం) విచారించిందుకు సుప్రీం అనుమతి ఇచ్చింది.
నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case)లో ఈడీ (ED) ముందు విచారణకు మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) హాజరయ్యారు. యంగ్ ఇండియన్ ఫౌండేషన్ అనే ఛారిటీ సంస్థకు గతంలో రూ.20 లక్షలు విరాళం ఇచ్చారు. గత నవంబర్లో ఈడీ విచారణకు అంజన్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం అంజన్ కుమార్ యాదవ్కు ఈ నెల 31న విచారణకు రావాలంటూ నోటీసులు పంపారు.
క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు.
హైదరాబాద్లో బడా బాబులకు ఈడీ నోటీసులు అందాయి. లగ్జరీ కార్ల కొనుగోలుదారులపై ఈడీ నిఘా పెట్టింది.
బైజూస్ ఆన్లైన్ సంస్థ సీఈవో రవీంద్రన్పై ఈడీ అధికారులు కేసు నమోదు అయ్యింది.