Home » ED
హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. టి.వెంకట్రామి రెడ్డి, పీకే అయ్యర్ను ఈడీ అరెస్ట్ చేసింది. డీసీ ఆడిటర్ మనీ ఊమెన్ను ఈడీ అరెస్ట్ చేసింది. కెనరా, ఐడీబీఐ బ్యాంకులను మోసం చేసిన కేసులో అరెస్ట్ చేయడం గమనార్హం.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడు మాగుంట రాఘవ మధ్యంతర బెయిల్ రద్దు అయ్యింది. రాఘవ మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జూన్ 12న సరెండర్ కావాలని రాఘవను సుప్రీం ఆదేశించింది. మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ బెయిల్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాఘువ బెయిల్పై రేపు (శుక్రవారం) విచారించిందుకు సుప్రీం అనుమతి ఇచ్చింది.
నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case)లో ఈడీ (ED) ముందు విచారణకు మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) హాజరయ్యారు. యంగ్ ఇండియన్ ఫౌండేషన్ అనే ఛారిటీ సంస్థకు గతంలో రూ.20 లక్షలు విరాళం ఇచ్చారు. గత నవంబర్లో ఈడీ విచారణకు అంజన్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం అంజన్ కుమార్ యాదవ్కు ఈ నెల 31న విచారణకు రావాలంటూ నోటీసులు పంపారు.
క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు.
హైదరాబాద్లో బడా బాబులకు ఈడీ నోటీసులు అందాయి. లగ్జరీ కార్ల కొనుగోలుదారులపై ఈడీ నిఘా పెట్టింది.
బైజూస్ ఆన్లైన్ సంస్థ సీఈవో రవీంద్రన్పై ఈడీ అధికారులు కేసు నమోదు అయ్యింది.
రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ జరిగింది. మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు న్యాయమూర్తి నాగ్ పాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయవాదులు తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కుంభకోణంలో మూడో అదనపు ఛార్జ్ షీట్ను ఈడీ దాఖలు చేసింది.
ఈడీపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ను త్వరగా విచారణ చేపట్టాలని జస్టిస్ రస్తోగి ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మెన్షన్ చేశారు.