Home » ED
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్పై ఉత్కంఠ వీడింది. నేడు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. సీబీఐ స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి భవేజా కవితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పును వెలువరించారు. ఏప్రిల్ 4న కవిత బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్పై ఉత్కంఠ కొనసాగుతోంది. నేడు లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించనుంది.
రాజకీయాల్లోకి వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా వెల్లడించారు. తాను రాజకీయాల్లోకి రావాలని అమేథి నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారని తెలిపారు. అమేథి ప్రస్తుత ఎంపీ స్మృతీ ఇరానీ వల్ల నియోజకవర్గ ప్రజలు బాగా నిరాశకు గురయ్యారని చెప్పారు.
ఎమ్మెల్సీ కవిత నేడు రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఈడీ(ED) అధికారులు.. కవితను రౌస్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) హాజరుపరిచారు. కాగా.. కవిత కేసులో ఇరువైపుల వాదనలు ముగిశాయియి.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు(arvind Kejriwal arrest) చేయడంపై, రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్(Kapil Sibal) స్పందించారు. ఏం చేయాలో భారత కూటమి వెంటనే నిర్ణయించాలని అన్నారు. ఈ క్రమంలోనేఅరవింద్ కేజ్రీవాల్ను ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు రోస్ అవెన్యూ కోర్టు(rose avenue court)లో హాజరుపర్చనున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాత్రంతా ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. నేటి ఉదయం మరోసారి వైద్యపరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం11 గంటల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించనున్నారు. స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి కావేరీ బవేజా ఎదుట ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు.
ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని, అంత వరకూ ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్ను కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం అనుమతి ఇచ్చింది.
ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశారు. ఇప్పటి వరకూ కవితను టార్గెట్ చేస్తూ ఆయన ఎన్నో లేఖలు విడుదల చేశారు. కవితకు.. తనకు మధ్య జరిగిన ఛాటింగ్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది.
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత తరుఫున ఆమె భర్త అనిల్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే ఈడీ అరెస్టు చేసినట్లు పిటిషన్లో కవిత పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు చెప్పి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించి దర్యాప్తు సంస్థ పై తగిన చర్యలు తీసుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. కవిత తరుఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తున్నారు. కవితను అధికార దుర్వినియోగంతో అరెస్ట్ చేశారని.. సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టులో ఇచ్చిన మాట ఉల్లంఘించారన్నారు.