Home » ED
ఎమ్మెల్సీ కవిత నేడు రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఈడీ(ED) అధికారులు.. కవితను రౌస్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) హాజరుపరిచారు. కాగా.. కవిత కేసులో ఇరువైపుల వాదనలు ముగిశాయియి.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు(arvind Kejriwal arrest) చేయడంపై, రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్(Kapil Sibal) స్పందించారు. ఏం చేయాలో భారత కూటమి వెంటనే నిర్ణయించాలని అన్నారు. ఈ క్రమంలోనేఅరవింద్ కేజ్రీవాల్ను ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు రోస్ అవెన్యూ కోర్టు(rose avenue court)లో హాజరుపర్చనున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాత్రంతా ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. నేటి ఉదయం మరోసారి వైద్యపరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం11 గంటల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించనున్నారు. స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి కావేరీ బవేజా ఎదుట ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు.
ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని, అంత వరకూ ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్ను కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం అనుమతి ఇచ్చింది.
ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశారు. ఇప్పటి వరకూ కవితను టార్గెట్ చేస్తూ ఆయన ఎన్నో లేఖలు విడుదల చేశారు. కవితకు.. తనకు మధ్య జరిగిన ఛాటింగ్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది.
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత తరుఫున ఆమె భర్త అనిల్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే ఈడీ అరెస్టు చేసినట్లు పిటిషన్లో కవిత పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు చెప్పి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించి దర్యాప్తు సంస్థ పై తగిన చర్యలు తీసుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. కవిత తరుఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తున్నారు. కవితను అధికార దుర్వినియోగంతో అరెస్ట్ చేశారని.. సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టులో ఇచ్చిన మాట ఉల్లంఘించారన్నారు.
ఈడీ అధికారులపై పశ్చిమ బెంగాల్లో జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు అదుపులో లేవనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏమి కావాలని అడిగింది.
‘న్యూస్క్లిక్ టెర్రర్ కేసు’లో (NewsClick terror Case) వ్యాపారవేత్త, అమెరికన్ మిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్కు ఈడీ (Enforcement Directorate) సమన్లు జారీ చేసింది. భారత్లో చైనా అనుకూల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
లిక్కర్ పాలసీ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎగ్గొట్టారు. మనీల్యాండరింగ్ కోణంపై ఆరా తీసేందుకు ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.