Home » Doctor
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి వరకు ట్రాఫిక్ పోలీసులు మంగళవారం సాయంత్రం గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. 24 నిమిషాల వ్యవధిలోనే ఊపిరితిత్తులు ఆస్పత్రికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
హాస్టల్లో ఉండడం వల్ల అన్ని పూటలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కష్టమే. అయినా, బయట తేలికగా దొరికే కొన్ని ప్రత్యామ్నాయాలతో ఈ సమస్యను అధిగమించవచ్చు. సాధారణంగా సరైన ఆహారాన్ని తగిన మొత్తంలో తీసుకుంటే వెంటనే ఆకలి వేయదు.
పాతబస్తీకి చెందిన ఓ గర్భిణీ కింగ్కోఠి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఆమెకు అత్యవసరంగా హిమోగ్లోబిన్ పరీక్ష చేయాల్సి ఉంది. ల్యాబ్ సమయం అయిపోయింది. దీంతో ఆస్పత్రిలో ఉన్న ఏటీఎం యంత్రంపై పరీక్షలు చేసి క్షణాల్లో ఫలితాలు తెలుసుకున్నారు.
పొట్టచుట్టూ, కడుపులోని అవయవాలపై పేరుకునే కొవ్వును విసరల్ ఫ్యాట్ అంటారు. చర్మం కింద పేరుకునే కొవ్వును సబ్ క్యుటేనియస్ ఫ్యాట్ అంటారు. విసరల్ ఫ్యాట్ అధికంగా ఉంటే జీవనశైలి వ్యాధులు వస్తాయి.
వ్యాయామం చేయడంలో నిర్లక్ష్యం వహించడం, శక్తిహీనం కావడం, జీవనశైలి మార్పులు, విటమిన్ డి, బీ12, రక్తహీనత వంటి వాటితో 25 ఏళ్లకే యువత గుండెజబ్బులకు గురవుతున్నారని అపోలో ’హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025’ అధ్యయనం స్పష్టం చేసింది.
కింగ్ కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో బాల భీముడు జన్మించాడు. పురిటి నొప్పలతో అడ్మింట్ అయిన గర్భిణికి ఆస్పత్రి వైద్యులు బుధవారం అర్ధరాత్రి 2.18 గంటలకు సాధారణ ప్రసవం చేశారు.
డేటింగ్ యాప్లో పరిచయమైన వ్యక్తి (గే) తాను చెప్పినట్లు వినకపోతే చంపేస్తానంటూ ఓ వైద్యుడిని బెదిరించాడు. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసు ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు అనారోగ్యం వల్ల కాకుండా, సురక్షితం కాని ఆరోగ్య సంరక్షణ చర్యల వల్ల ఏర్పడే ముప్పుతో ఆందోళన చెందుతున్నారు. రోగి భద్రత అనేది కేవలం వైద్యపరమైన సంరక్షణ మాత్రమే కాదని, ఆస్పత్రులు, రోగులు, వారి కుటుంబాలు పంచుకునే నిబద్ధత అని వైద్యులు పేర్కొంటున్నారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్కానింగ్సెంటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను దోచుకుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరల నియంత్రణ లేకపోవడంతో ఒక్కోస్కానింగ్ సెంటర్లో పరీక్షలకు ఒక్కో రకంగా ఫీజులు వసూలు చేస్తున్నారు.
పదేళ్లలోపు పిల్లల్లో కంటి ఆరోగ్యం చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ వయసులోనే చూపు బలంగా ఉండేందుకు పునాది ఏర్పడుతుంది. సరైన ఆహారం ద్వారా కంటి ఆరోగ్యాన్ని బలోపేతం చేయవచ్చు. విటమిన్ ఎ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు ఇవ్వాలి, ఇవి చూపును కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.