Home » DMK
రాష్ట్రంలో రౌడీయిజం, దౌర్జన్యం, హత్యలు, దోపిడీలు, మాదకద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా జగుతోందని, ‘కమీషన్, కరప్షన్ నిర్విఘ్నంగా సాగుతోందని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధ్వజమెత్తారు.
మతవాద బీజేపీ గొంతుకగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ధ్వజమెత్తారు.
హిందీని బలవంతంగా రుద్దడంపై రెండు దశాబ్దాలుగా కేంద్రతో విభేదిస్తున్న స్టాలిన్ శనివారంనాడు ఒక ట్వీట్లో ఉద్ధవ్, రాజ్ ఒకే వేదికపై కలుసుకోవడం, విజయోత్సవం జరుపుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ సోదరులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.
బాధ్యతాయుతమైన 12వేల మందితో కూడిన యువజన విభాగం డీఎంకే సైన్యంగా ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) పేర్కొన్నారు..
రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా ద్రావిడ తరహా డీఎంకే ప్రభుత్వ పాలన చూసి ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు మెచ్చుకుంటున్నారని, గతంలో లేని విధంగా మూడువేలకు పైగా సుప్రసిద్ధ ఆలయాలకు మహాకుంభాభిషేకాలను జరిపించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.
ట్రెండ్ మారిన ‘తమిళనాడు ఇన్ యూనిట్’ అనే ప్రచారం ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకోనున్నట్లు డీఎంకే ప్రధాన కార్యదర్శి, మంత్రి దురైమురుగన్ తెలిపారు.
వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి 200 సీట్లకన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకోవటం ఖాయమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు.
కంటికి కనిపించని, గాలిలో కూడా అవినీతికి పాల్పడి కటకటాలు లెక్కించిన డీఎంకే ఎంపీ ఎ.రాజా అవినీతికి ఆధ్యుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ విమర్శించారు.
మదురై మురుగన్ భక్తుల మహానాడులో పెరియార్, అన్నాదురై ద్రావిడ సిద్ధాంతాలను విమర్శిస్తూ రూపొందించిన వీడియోలను ప్రదర్శిస్తుంటే అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రులు ఆర్బీ ఉదయకుమార్, సెల్లూరు రాజు, కడంబూరు రాజు, రాజేంద్రబాలాజీ ఆసక్తిగా చూస్తూ పార్టీ పరువును దిగజార్చుకున్నారని డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్ఎస్ భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి డీఎంకే కారణం కాదని ఆ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ స్పష్టం చేశారు. నగరంలో అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పార్టీ గౌరవాధ్యక్షుడు జీకే మణి, ఎమ్మెల్యే అరుళ్ను పరామర్శించేందుకు గురువారం రాందా స్ దిండివనం నుం డి నగరానికి చేరుకున్నారు.