Home » DMK
బాధ్యతాయుతమైన 12వేల మందితో కూడిన యువజన విభాగం డీఎంకే సైన్యంగా ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) పేర్కొన్నారు..
రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా ద్రావిడ తరహా డీఎంకే ప్రభుత్వ పాలన చూసి ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు మెచ్చుకుంటున్నారని, గతంలో లేని విధంగా మూడువేలకు పైగా సుప్రసిద్ధ ఆలయాలకు మహాకుంభాభిషేకాలను జరిపించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.
ట్రెండ్ మారిన ‘తమిళనాడు ఇన్ యూనిట్’ అనే ప్రచారం ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకోనున్నట్లు డీఎంకే ప్రధాన కార్యదర్శి, మంత్రి దురైమురుగన్ తెలిపారు.
వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి 200 సీట్లకన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకోవటం ఖాయమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు.
కంటికి కనిపించని, గాలిలో కూడా అవినీతికి పాల్పడి కటకటాలు లెక్కించిన డీఎంకే ఎంపీ ఎ.రాజా అవినీతికి ఆధ్యుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ విమర్శించారు.
మదురై మురుగన్ భక్తుల మహానాడులో పెరియార్, అన్నాదురై ద్రావిడ సిద్ధాంతాలను విమర్శిస్తూ రూపొందించిన వీడియోలను ప్రదర్శిస్తుంటే అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రులు ఆర్బీ ఉదయకుమార్, సెల్లూరు రాజు, కడంబూరు రాజు, రాజేంద్రబాలాజీ ఆసక్తిగా చూస్తూ పార్టీ పరువును దిగజార్చుకున్నారని డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్ఎస్ భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి డీఎంకే కారణం కాదని ఆ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ స్పష్టం చేశారు. నగరంలో అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పార్టీ గౌరవాధ్యక్షుడు జీకే మణి, ఎమ్మెల్యే అరుళ్ను పరామర్శించేందుకు గురువారం రాందా స్ దిండివనం నుం డి నగరానికి చేరుకున్నారు.
మదురైలో మురుగన్ మహానాడు నిర్వహించడం వల్ల రాష్ట్రంలో బీజేపీ పరపతి పెరిగే అవకాశమే లేదని డీఎంకే ఎంపీ కనిమొళి ఎద్దేవా చేశారు. కన్నియాకుమారిలో బుధవారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ డీఎంకే కూటమి మరింత పటిష్టంగానే ఉందని మిత్రపక్షాల్లో కొన్ని పార్టీలు కూటమి నుండి వైదొలగుతాయని బీజేపీ, అన్నాడీఎంకే నేతలు చేస్తున్న ప్రకటనలు అవాస్తవాలన్నారు.
ఢిల్లీ నుండి రాష్ట్రంపై పెత్తనం చెలాయించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. సేలంలోని మోహన్కుమారమంగళం ప్రభుత్వ వైద్యకళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో రూ.880 కోట్లతో నిర్మించనున్న జౌళి పార్కుకు, రూ.100 కోట్లతో నిర్మించనున్న కొత్త గ్రంథాలయ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.
ఎన్నికల్లో కూటమి లేకుండా డీఎంకే గెలవడమన్నది అసాధ్యమని, 2019 లోక్సభ ఎన్నికల నుండి 2024 లోక్సభ ఎన్నికల దాకా మిత్రపక్షాలను కలుపుకునే ఆ పార్టీ గెలిచిందని, ఈ పరిస్థితి వచ్చే యేడాది జరిగే శాసనసభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి పి.షణ్ముగం వ్యాఖ్యానించారు.