Home » DMK
రాష్ట్రంలో త్రిభాష విద్యావిధానం అమలు చేసి హిందీ భాషకు పట్టంగట్టే ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ ‘మోదీ గెట్ అవుట్’ నినాదంతో ఉద్యమాన్ని నిర్వహించాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి చేసిన ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నాడీఎంకే - బీజేపీ ఏకమై రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా డీఎంకే కూటమిని ఓడించడం సాధ్యం కాదని రాష్ట్రన్యాయశాఖా మంత్రి రఘుపతి(Minister Raghupathi) జోష్యం చెప్పారు.
మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్హాసన్(Kamal Hasan)తో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Udayanidhi) గురువారం భేటి అయ్యారు. డీఎంకే కూటమిలో భాగస్వామ్యం వహిస్తున్న ఎంఎన్ఎంకు ఒక రాజ్యసభ స్ఠానం ఇవ్వాలని డీఎంకే నిర్ణయించిన విషయం తెలిసిందే.
పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా లేకపోయినా డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయం కూల్చివేసేంత వరకు తాను రాష్ట్రంలోనే ఉంటానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) శపథం చేశారు.
రాష్ట్రంలో ముస్లింలు, క్రైస్తవుల ఓట్ల కోసం అధికార డీఎంకే(DMK) వారికి కొమ్ముకాస్తోందని బీజేపీ(BJP) రాష్ట్ర విభాగం విమర్శించింది. హిందూ క్షేత్రమైన తిరుప్పరంకుండ్రంను కాపాడుకోవలని పోరాటాలకు దిగిన హిందువులను అనగదొక్కేవిధంగా డీఎంకే ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఖండించదగ్గవన్నారు.
పాలనవ్యవహారాల్లో మితిమీరి జోక్యం చేసుకుంటున్న గవర్నర్(Governor)కు ప్రవర్తనా నియమావళి రూపొందించాలని, రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులపై సంతకం చేసేందుకు గవర్నర్కు నిర్ణీత గడువు కూడా విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ డీఎంకే ఎంపీల సమావేశంలో ఓ తీర్మానం చేశారు.
'నీట్' అంశంతో సహా రాష్ట్రంలోని పలు అంశాలపై గవర్నర్, డీఎంకే మధ్య చాలాకాలంగా సయోధ్య లేదు. తమిళనాడులోని విశ్వవిద్యాలయలకు వీసీల నియామకం విషయంలో గవర్నర్కు, డీఎంకే ప్రభుత్వాన్ని మధ్య జరుగుతున్న గొడవపై ఇటీవలే రాష్ట్ర సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
గోమూత్రం తాగితే 15 నిమిషాల్లో జ్వరం నయమవుతుందని, అందుకే అప్పుడప్పుడు తాగడం మంచిదని ఐఐటీ మద్రాస్ డైరక్టర్ కామకోటి ఇటీవల వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన వీడియో ఇటీవల ఆన్లైన్లో వైరల్ అవడంతో తమిళనాడులోని ప్రముఖ రాజకీయ పార్టీ నేతలు సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వేస్తున్నారు..
వచ్చే యేడాది సంక్రాంతికల్లా డీఎంకేని కూకటి వేళ్లతో సహా పెకలిస్తామని, రాష్ట్రం నుంచి ఆ పార్టీని తరిమికొడతామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) శపథం చేశారు.
రెండు రోజుల క్రితం వరకు ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్(K. Balakrishnan)కు ఏమైందని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని విమర్శించడం మతిభ్రమించినట్లుగా ఉందని హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్బాబు(Minister PK Shekhar Babu) విమర్శించారు.