Home » DK Shivakumar
మైసూరులో శనివారంనాడు ఏర్పాటు చేసిన సాధానా సమావేశంలో ప్రభుత్వం సాధించిన విజయాలను సిద్ధరామయ్య ప్రస్తావించారు. కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. డీకే శివకుమార్తో పాటు పలువురు కీలక నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు.
శ్రీరంగపట్న ప్రాంతంలోని ఎక్స్ప్రెస్వేపై గౌడహళ్లి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్కార్ట్ వాహనం డివైడర్ను ఢీకొట్టి తల్లకిందులైంది. క్షతగాత్రులను మైసూరులోని ఆసుపత్రికి తరలించారు.
నాయకత్వ మార్పు అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా బెంగళూరులోనే మకాం వేశారు. 15రోజుల వ్యవధిలో మూడు విడతలలో 9 రోజులపాటు బెంగళూరులో గడిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై అభివృద్ధితోపాటు ఇతరత్రా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
కర్ణాటకలో 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పడు అధికార పంపకాల విషయంలో సిద్ధరామయ్య, డీకే మధ్య ఒక అవగాహన కుదిరిందనే వాదన మొదట్నించీ వినిపిస్తోంది. మొదటి రెండున్నరేళ్లు సిద్ధరామయ్య సీఎంగా పగ్గాలు పట్టుకుంటే, తక్కిన రెండున్నరేళ్లు డీకే పగ్గాలు చేపడతారనేది ఆ ఒప్పందం.
ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రిని అంటూ సిద్దరామయ్య ఢిల్లీ వేదికగా పదే పదే ప్రకటించినా అధిష్ఠానానికి చెందిన ముఖ్యులు ఎవరూ స్పందించకపోవడం, పైగా గతంలో మాదిరిగా ఎవరూ నాయకత్వ మార్పు గురించి మాట్లాడరాదని హుకుం జారీ చేసిన అగ్రనేతలు ఈ అంశమే మాకు సంబంధం లేదనేలా ఉండడంతో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్ ఒక్కసారిగా దిగాలు పడ్డారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని నెలల్లోనే మార్పులు ఉంటాయని, అందులో ప్రధానంగా నాయకత్వ మార్పు ఉంటుందనే అంశం కొన్ని నెలలుగా హల్చల్ చేస్తోంది.
కర్నాటకలో సీఎంగా ఐదేళ్ల పాటు తానే కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. కర్నాటకలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగాహానాలను కొట్టిపారేశారు..
చన్నపట్టణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్కు వ్యతిరేకంగా భార్య, కుమార్తెలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కేపీసీసీ కార్యాలయంలో బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలాను వారు భేటీ అయ్యారు.
కాంగ్రెస్లో ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రిని మార్చేందుకు డిల్లీ కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. సీఎం సిద్దరామయ్య పదవి నుంచి దిగినా డీకే శివకుమార్ సీఎం అయ్యేందుకు సిద్దరామయ్య మద్దత్తు ఇవ్వడు.
ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల తేల్చిచెప్పారు. డీకే, తానూ కలిసి పనిచేస్తున్నామని, పార్టీ ఐక్యంగా ఉందని చెప్పారు. డీకే శివకుమార్ సైతం తనకు మరో దారి లేదని, అధిష్ఠానం నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని చెప్పారు.