Home » District
ప్రతిపక్ష నేతగా చేపట్టిన పాదయాత్రలో జగనరెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదు. రాయదుర్గం నియోజకవర్గంలో మూడు హామీలను ఇచ్చి ఇప్పటికీ తీర్చకపోవడంపై జనం పెదవి విరుస్తున్నారు. వాటిలో ముఖ్యంగా భైరవానతిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలను మళ్లిస్తామని, తుంగభద్ర ఎగువకాలువను ఆధునికీకరిస్తామని, బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు వద్ద నేమకల్లు ఆంజనేయస్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను ఐదు టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తామని హామీలు గుప్పించారు.
ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల విధులకు హాజరయ్యేవారు ఈ నెల 28 వరకు పోస్టల్ బ్యాలెట్కోసం ఫారం-12 దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలోని ఆర్వోలకు దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు.
హైదరాబాద్: ఈనెల 29, 30 తేదీల్లో బీజేపీ సమీక్షా సమావేశాలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లా అసెంబ్లీ వారీగా నిర్వహించేందుకు నేతలు నిర్ణయించారు. రెండు జిల్లాలకు ఒకరు చొప్పున జాతీయ నేతలు తరుణ్చుగ్, సునీల్ బన్సల్, జావదేకర్, అరవింద్ వెళ్లనున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)పై టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి (Former TDP minister Somireddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.