Home » Devineni Umamaheswara Rao
సీఎం జగన్రెడ్డి (CM Jagan Reddy) చెప్పిన అబద్దాలే మళ్లీ మళ్లీ చెప్పి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ (Telugudesam Party) సీనియర్ నేత దేవినేని ఉమ (Devineni Uma) అన్నారు. తాను ఫ్టస్ట్ క్లాస్ స్టూడెంట్ అని శాసన సభలో జగన్ చెప్పారని... అబద్దాలు చెప్పడంలో జగన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంటేనని ఎద్దేవా చేశారు.
Devineni Uma: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు (Devineni Uma Maheswara Rao).. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) కీలక బాధ్యతలు అప్పగించారు...
అమరావతే రాజధాని అని ఈ ప్రాంత ప్రజలను, రైతులను నమ్మించి సీఎం జగన్రెడ్డి గొంతు కోశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) అన్నారు. సోమవారం నాడు ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు కాన్వాయిని తనిఖీల పేరుతో ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నారని మండిపడ్డారు.
ట్రాఫిక్కి కారణమై ప్రజలకు ఇబ్బందులకు గురి చేశారన్న కారణంతో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమతోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి జక్కంపూడి కాలనీలో టీడీపీ జెండాలతో ఆయన ర్యాలీ నిర్వహించారు.
చంద్రబాబు నాయుడు, లోకేష్ కల్పించిన ఈ అవకాశం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మైలవరంలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను, అందరిని కలుపుకొని ముందుకు వెళ్తానని అన్నారు. గత 15 ఏళ్లుగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇన్చార్జిగా ఉండటంతో అక్కడున్న వారిని అందరిని కలుపుకొని ముందుకెళ్తానని చెప్పారు. తనకు ఎవరితో వ్యక్తిగత వివాదాలు లేవని అన్నారు.
టీడీపీ మూడో జాబితా ఇవాళ విడుదలైన విషయం తెలిసిందే. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నుంచి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టికెట్ దక్కించుకున్నారు. ఇటీవలే ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ మైలవరం టికెట్ దక్కించుకున్నసందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కృషితో జాతీయ ప్రాజెక్టుగా పోలవరానికి గుర్తింపు తెస్తే.. సీఎం జగన్ రెడ్డి (CM Jagan) విధ్వంసంతో జాతికి ద్రోహం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) అన్నారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజావేదిక విధ్వంసతో ప్రారంభమైన జగన్ రెడ్డి పాలన డయఫ్రం వాల్ విధ్వంసంతో ముగిసిందని మండిపడ్డారు.
బాబ్లీ ప్రాజెక్ట్ ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులో నాటి ఎమ్మెల్యేలు దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబులకు మహారాష్ట్రలోని బిలోలి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
స్పైడర్ సినిమాలోని భైరవ పాత్రధారికి మరో రూపమే సీఎం జగన్ రెడ్డి(CM Jagan) అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) ఆరోపించారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేసి, కక్షసాధింపులకు పాల్పడి రాబోయే ఎన్నికల్లో పోటీచేయకుండా అడ్డుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
తనను దొంగ దెబ్బతీయడానికి సందు గొందుల్లో వైసీపీ నేతలు కాపు కాశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Uma) అన్నారు. సోమవారం నాడు జక్కంపూడి కాలనీలో జరిగిన శంఖారావం సభలో పాల్గొని దేవినేని మాట్లాడుతూ... సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ కేశినేని నాని, వైసీపీ నేతలపై ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.