• Home » Delhi liquor scam

Delhi liquor scam

Delhi: కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా నేడు ఆప్ నిరసనలు..

Delhi: కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా నేడు ఆప్ నిరసనలు..

ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఆమాద్మీ పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆప్ నేతలు గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్, సందీప్ పాఠక్, అతిషి మర్లీనా వెల్లడించారు.

Delhi Liquor Scam Case: మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకు ఎంతమంది అరెస్టయ్యారంటే..

Delhi Liquor Scam Case: మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకు ఎంతమంది అరెస్టయ్యారంటే..

Delhi Liquor Scam Case: మద్యం కుంభకోణం వెలుగు చూసినప్పటి ఎప్పుడూ ఏదో ఒక సంచలనం ఉంటూనే ఉంది. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Kejriwal Arrest) అరెస్ట్‌తో ఈ కేసు పీక్స్‌కు చేరింది. 2022లో ఈ కేసులు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈడీ(ED), సీబీఐ(CBI) వేసే ప్రతి స్టెప్.. తీసుకునే ప్రతి నిర్ణయం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.

Arvind Kejriwal Arrest: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్..

Arvind Kejriwal Arrest: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్..

Arvind Kejriwal Arrest: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఈడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటి నుంచి ఆయన ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆప్ కార్యకర్తలు అడ్డుకోబోగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు.

AAP: కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయొచ్చు.. అతని ఆలోచనలను కాదు: ఆప్ నేతలు

AAP: కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయొచ్చు.. అతని ఆలోచనలను కాదు: ఆప్ నేతలు

లిక్కర్ స్కామ్‌లో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. కొత్తగా రూపొందించిన ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఈడీ అధికారులు చెబుతున్నారు. కేజ్రీవాల్‌‌ను అరెస్ట్ చేయడాన్ని ఆప్ నేతలు ముక్తకంఠంతో ఖండించారు.

Delhi Liquor Scam Case: క్షణం క్షణం ఉత్కంఠ.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేజ్రీవాల్..

Delhi Liquor Scam Case: క్షణం క్షణం ఉత్కంఠ.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేజ్రీవాల్..

CM Kejriwal: దేశ రాజధాని ఢిల్లీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఓవైపు సీఎం కేజ్రీవాల్(CM Kejriwal).. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు(ED).. పరిస్థితి తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Liquor Scam Case) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేస్తుందని గట్టి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం..

Delhi CM Aravind Kejriwal: మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేజ్రీవాల్

Delhi CM Aravind Kejriwal: మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈడీ అరెస్టు చేయకుండా నిలిపివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బలవంతపు చర్య (అరెస్ట్)లకు దిగవద్దని ఈడీని ఆదేశించాలని కోర్టును కోరారు.

Delhi Liquor Scam: అభిషేక్ బోయినపల్లికి బెయిల్..

Delhi Liquor Scam: అభిషేక్ బోయినపల్లికి బెయిల్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడు అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైద్య కారణాలతో 5 వారాలు మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. పలు షరతులను కూడా సుప్రీం ధర్మాసనం విధించింది.

Aravind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ

Aravind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సురేశ్ కుమార్ కైత్, జస్టిస్ మనోజ్ జైన్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) సమన్లను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. తనకు ఇప్పటి వరకూ జారీ చేసిన 9 సమన్లను కేజ్రీవాల్ సవాల్ చేశారు.

Kavitha: నేడు  నాలుగో రోజు ఈడీ కస్టడీలో కవిత

Kavitha: నేడు నాలుగో రోజు ఈడీ కస్టడీలో కవిత

న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నాలుగో రోజు బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈసీ) అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్‌లో కవితను విచారిస్తున్నారు.

MLC Kavitha-ED: ఎమ్మెల్సీ కవిత కేసు విచారణలో ఊహించని ట్విస్ట్

MLC Kavitha-ED: ఎమ్మెల్సీ కవిత కేసు విచారణలో ఊహించని ట్విస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుని విచారిస్తున్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి నాగ్‌పాల్ బదిలీ అయ్యారు. నాగ్‌పాల్ స్థానంలో న్యాయమూర్తి కావేరీ బవేజా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు జ్యుడీషియల్ సర్వీసెస్‌లోని మరో 26 మంది న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి