Home » delhi liquor scam case
MLC Kavitha Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితను అరెస్ట్ చేయడం జరిగింది.
ED Raids On Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) ఏ క్షణమైనా అరెస్ట్ చేయడానికి ఈడీ, ఐడీ (ED, IT) రంగం సిద్ధం చేసిందా..? సుదీర్ఘ సోదాల తర్వాత కవితను అదుపులోనికి తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయా..? అంటే హైదరాబాద్లో ఆమె ఇంటి దగ్గర పరిస్థితులను బట్టి చూస్తే కచ్చితంగా ఇదే జరగొచ్చని తెలుస్తోంది..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఇంటిపై ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం ఈ సోదాలు చేస్తోంది...
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ.. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్తో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరగనుంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులను సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. లిక్కర్ కేసులో ఈడి నోటీసులను గతేడాది సుప్రీంకోర్టులో కవిత సవాలు చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మరోసారి ఈడీ సమన్లు పంపించింది. మద్యం విధానం కేసు దర్యాప్తులో విచారణకు హాజరు కావాలని కేజ్రీకి ఈడీ సమన్లు ఏడోసారి సమన్లు పంపించింది. ఈ నెల 26న హాజరు కావాలని సూచించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో పంపిన సమన్లను సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాటవేయడంపై ఈడీ అధికారులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేజ్రీవాల్పై ఫిర్యాదు చేసేందుకు దర్యాప్తు సంస్థ కోర్టు మెట్లెక్కింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఈడీ(ED) మళ్లీ సమన్లు పంపింది. మద్యం కుంభకోణం(Delhi Liquor Scam) కేసులో విచారణకు రావాల్సిందిగా సమన్లు పంపడం ఇది నాలుగో సారి. తాజాగా ఆయన్ని జనవరి 18న ఈడీ ముందు హాజరుకావాలని కోరింది.
ల్లీ లిక్కర్ కేసు ( Delhi Liquor case ) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు అరుణ రామచంద్రన్ పిళ్ళై ( Aruna Ramachandran Pillai ) కి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగ్ పాల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. భార్య అనారోగ్య కారణంగా పిళ్ళైకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
లిక్కర్ పాలసీ కేసులో దర్యాప్తు సంస్థల సుదీర్ఘ విచారణ తీరుపై సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారంనాడు అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ పేరుతో సుదీర్ఘ కాలం ఎవరినీ కటకటాల వెనుక ఉంచడం సరికాదని స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.